తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంలో యావత్ రాష్ట్ర విద్యార్థి లోకం భగ్గుమంటోంది. ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, మరెందరికో అన్యాయం జరగడంపై వారు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యార్థులు ఇటు వారి తల్లిదండ్రులు కూడా ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు అధికారులు అటలాడుతున్నారని.. వారి బంగారు భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చారని ఆయన ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులను కఠినం శిక్షించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. చేతికందిన బిడ్డలను ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా కోల్పోయిన తల్లిదండ్రులకు ఎలా న్యాయ చేస్తారని వారు నిలదీశఆరు. వారికి తాము అండగా నిలుస్తామని జనసేనికులు పేర్కోన్నారు. ఇంటర్ బోర్డు అధికారుల తప్పిదాల వల్ల నష్టపోయిన మిగిలిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన జనసేన శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు, గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో ఇప్పటివరకూ 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more