ఆంధ్రప్రదేశ్ ఐఎఎస్ అధికారుల సమావేశం గత రాత్రి అనుకున్నంత మేర సక్సెస్ కాకపోవడం.. కేవలం 9 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరుకావడంతో.. తన సత్తా ఎంటో చూపాలను భావించిన రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోంశాఖ కార్యదర్శి అనురాధ హాజరయ్యారు.
అలాగే జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పరిస్థితుల గురించి సీఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనీ, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై సీఎస్ సమీక్ష నిర్వహించడంపై మంత్రులు మండిపడుతున్న నేపథ్యంలో సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం.
కాగా, పసుపు-కుంకుమ, పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం వంటి పేదల పథకాలకు నిధుల విడుదలపై సమీక్ష నిర్వహించడాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. ఈ పథకాల అమలుకు బడ్జెట్ లో నిధులు లేవని చెప్పడంపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.5,000 కోట్లు, పసుపు-కుంకుమ పథకానికి రూ.4,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించామని గుర్తుచేశారు. ఈ పథకాలతో పాటు పింఛన్ల కేటాయింపు విషయాన్ని బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్నామన్నారు.
ఎన్నికల కోడ్ రాకముందే రైతులు, మహిళలకు చెక్కులు అందజేశామని యనమల తెలిపారు. బడ్జెట్ లో ఉన్న ఈ పథకాలు ఎన్నికల కోడ్ కిందకు రావని ఇప్పటికే కోర్టులు స్పష్టం చేశాయని యనమల అన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయని గుర్తుచేశారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించడం సరికాదని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో వున్న ఆయన రాజకీయ నేతగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా సముచితం కాదని యనమల అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more