బీహార్ ను నిన్నమొన్నటి వరకు గుండారాజ్ అని అభివర్ణించేవాళ్లు. నిరక్షరాస్యత, నిరుద్యోగంతో అక్కడి యువత అధికంగా సంఘ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటంతో ఇలాంటి పేరు వచ్చిందని ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంతగా పరిస్థితులు మారినా.. అప్పడప్పడు మాత్రం అక్కడ జరిగే పలు ఘటనలు బీహార్ మార్కును మాత్రం చాటుతుంటాయి. ఎంతలా అంటే కనీసం కనికరం కూడా లేకుండా అక్కడి దోంగలు చేసే చోరీలకు ఈ ఘటన ఓ నిదర్శనం.
బ్యాంకులో లక్షల నగదు డ్రా చేశాడో యువకుడు. రూ. 2.5 లక్షల నగదును బ్లాక్ బ్యాగులో పెట్టుకుని మెల్లగా బయటకు వచ్చాడు. అటు ఇటు చూశాడు. కానీ, అక్కడే మాటు వేసిన ఇద్దరు దొంగలు అతన్ని మెల్లగా వెంబడించారు. డబ్బుల బ్యాగుతో వెళ్తున్న యువకుడిని అడ్రస్ అడుగుతున్నట్టు మాటల్లో పెట్టారు. ఇంతలో వెనుక నుంచి ఇద్దరు దొంగలు బైక్ పై దూసుకొచ్చారు. యువకుడి చేతిలో బ్యాగును కొట్టేశారు. అయినప్పటికీ అతడు ఆ బ్యాగును వదల్లేదు. దాదాపు కిలోమీటరు వరకు బైక్ వెనుక వేలాడుతూ బ్యాగును అలానే పట్టుకున్నాడు.
దొంగలు బైక్ పై మరింత స్పీడ్ గా దూసుకెళ్తూ అతడ్ని ఈడ్చుకోని వెళ్లారు. ఈ ఘటన బీహార్ లోని హజిపూర్ ప్రాంతంలో ఇవాళ జరిగింది. దీనికి సంబంధించి వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో దొంగల బైక్ వెనుక బ్యాగు పట్టుకుని యువకుడు వేలాడుతుండగా.. ఈడ్చుకెళ్లడం చూడవచ్చు. అయితే బీహార్ లో ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలో ఇక్కడ ఎన్నో చోరీ ఘటనలు వెలుగుచూశాయి. ఏప్రిల్ 2న ఈస్ట్ చాంపరన్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి దొంగలు రూ. 3 లక్షలు దోచుకెళ్లారు.
#WATCH Bihar: A man was dragged behind bike after two unidentified bike-borne miscreants snatched Rs. 2.5 lakh from him in Hajipur, earlier today. pic.twitter.com/Gnwkxe1de6
— ANI (@ANI) April 23, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more