క్రైస్తవుల అత్యంత పవిత్రమైన ఈస్టర్ పర్వదినం రోజున స్థానికంగా వున్న చర్చీలకు వెళ్లి ప్రార్థనలు జరిపిన భక్తులపై ఆత్మహుతి దాడులతో విరుచుకుపడి పచ్చటి పండగ రోజును నెత్తురిధారాలతో ఘోరకళి సృష్టించింది తామేనంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఓ వైపు చర్చీలు, మరోవైపు పర్యాటకులు సేదతీరే లగ్జరీ హోటళ్లలపై మానవబాంబులతో విరుచుకుపడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తన అమాక్ సమాచార సంస్థ ద్వారా ఐఎస్ శ్రీలంకలో పేలుళ్లు జరిపింది తామేనని తెలిపింది.
శ్రీలంకలో న్యూజిలాండ్ లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో ఆత్మహుతి దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆయన ఈ మారణఖాండ వెనుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వున్నారని తెలిపారు. న్యూజీలాండ్ క్రైస్ట్ చర్చ్ దాడులకు ప్రతీకారంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు లంకలో పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు.
కాగా దేశ రక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. అన్ని ఉగ్ర సంస్థలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్రైస్ట్ చర్చ్ లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య 321కి చేరుకున్నది. వీరిలో 38 మంది విదేశీయులు వుండగా, ఈ దారుణ మారణఖాండలో 10 మంది భారతీయులు కూడా అసువుల బాసారు. పేలుళ్లలో మృతిచెందిన వారికి సామూహిక ఖననం చేస్తున్నారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more