Death toll rises to 310 in sri lanka 310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య.. అదుపులో 40 మంది

Death toll from sri lanka attacks rises to 310 and about 500 wounded

Sushma-Swaraj, Sri-Lankan-Tamils, Sri-Lanka-Easter-attack, sri-lanka-bomb-blasts, sri-lanka-blasts, sri-lanka-attack, Easter-blast, Blasts-in-Sri-Lanka, Thawheed Jamaat, terror attack, sri lanka blasts, colombo chruch blasts, Crime

Authorities implimented emergency in Sri Lanka since Monday midnight, two days after a string of bombings at churches and luxury hotels across the Indian Ocean island killed 310 people and wounded about 500,

310కి చేరిన శ్రీలంక మృతుల సంఖ్య.. అదుపులో 40 మంది

Posted: 04/23/2019 12:08 PM IST
Death toll from sri lanka attacks rises to 310 and about 500 wounded

శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 310కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన ఈస్టర్ పర్వదినం నేపథ్యంలో చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేసిన క్రైస్తవులను టార్గెట్ చేసిన ముష్కరులు.. ఆరు చర్చీలు రెండు హోటళ్లల్లో పేల్చిన బాంబులతో శ్రీలంకలో బీతావాహ వాతావరణం అలుముకున్న విషయం తెలిసిందే. వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు అక్కడ నెత్తుటి ఏర్లు పారించాయి. ఈ పేలుళ్ల మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న 290కి చేరిన మృతుల సంఖ్య ఇవాళ మరింత పెరిగి 310కి చేరకుని భయాందోళన కలిగిస్తోంది.

కాగా 310 మందిలో 39 మంది విదేశీ పర్యాటకులు వున్నట్లు శ్రీలంక అధికార వర్గాలు తెలిపాయి. మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఏడుగురు జేడీఎస్ నేతల్లో నలుగురు ఈ ఘటనలో అసువుల బాసినట్లు అధికారికంగా వెళ్లడైంది. అయితే మిగిలిన ముగ్గురు కోసం అన్వేషణ సాగుతోంది. ఇక విదేశీ పర్యాటక మరణాలకు బాధ్యత వహించిన శ్రీలంక ప్రభుత్వం వారికి నష్టపరిహారంగా పదిలక్షల శ్రీలంక రూపాయలను చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇక దహనసంస్కారణాల నిమిత్తం పదివేల రూపాయలను కూడా అదనంగా అందించనున్నట్లు ప్రకటించింది.

మరోవైపు, 40 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని కస్టడీకి తరలించామని... వీరంతా శ్రీలంక జాతీయులేనని శ్రీలంక పోలీస్ అధికార ప్రతినిధి ఎస్పీ రువాన్ గుణశేఖర తెలిపారు. ఇదిలా ఉంచితే, విదేశీ దౌత్యవేత్తలు, హై కమిషనర్లతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పేలుళ్ల గురించి వారికి వివరించడమే కాక, అంతర్జాతీయ సహకారాన్ని ఆయన కోరనున్నారు. స్థానిక టెర్రరిస్టుల వెనుక అంతర్జాతీయ ఉగ్ర సంస్థల హస్తం ఉందని శ్రీలంక రక్షణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ ఘటన దర్యాప్తు కోసం అంతర్జాతీయ సహకారాన్ని కోరనున్నామని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terror attack  sri lanka blasts  colombo chruch blasts  Thawheed Jamaat  Crime  

Other Articles