వరస బాంబు పేలుళ్లతో వణికిపోతున్న శ్రీలంక వెన్నులో వణుకుపుట్టేలా కొలంబోలో మరోసారి బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం ఓ చర్చి వద్ద పేలుడు సంభవించింది. ఆగి ఉన్న వ్యానులో అమర్చిన బాంబు ఒక్కసారిగా పేలింది. బాంబు ఉందని తెలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళాలు దాన్ని నిర్వీర్యం చేసే లోపే పేలిపోయింది. పవిత్రమైన ఈస్టర్ డే రోజున శ్రీలంకలో ముష్కరమూకలు మారణహోమానికి తెగబడ్డగా, భద్రతా దళాలు వాటిని బాంబుల కోసం వెతకసాగాయి.
ఈ క్రమంలో ఓ కొలంబో విమానాశ్రయం సమీపంలో బాంబును నిర్వీర్యం చేసిన దళాలు.. కొచ్చి కేడ్ లోని సెయింట్ ఆంథోనీస్ చర్చి వద్ద ఉన్న వ్యానులో ఉంచిన బాంబు వుందని భద్రతా బలగాలు సమాచారం అందుకున్నాయి. బాంబు ఉందని తెలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళాలు దాన్ని నిర్వీర్యం చేసే లోపే పేలిపోయింది. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాణనష్టం జరిగిందా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
పేలుళ్ల అనంతరం అధికారులు భద్రతా చర్యలను అప్రమత్తం చేశారు. అణువణువూ గాలిస్తున్నారు. కొలంబోలోని ప్రధాన బస్ స్టేషన్ వద్ద 87 డిటోనేటర్లను గుర్తించి నిర్వీర్యం చేశారు. అంతకుముందు విమానాశ్రయం వద్ద అమర్చిన బాంబును గుర్తించి నిర్వీర్యం చేశారు. తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించామని, సమయానికి గుర్తించకపోయి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. కొలంబోలోని చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ విధించినట్లు తెలుస్తోంది.
కాగా, శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రేపు సంతాప దినంగా ప్రకటించింది. ఇదిలావుండగా, శ్రీలంక బాంబుపేలుళ్ల ఘటనలో మరో ఇద్దరు భారతీయులు మృతిచెందారని శ్రీలంకలోని భారత హై కమీషన్ వెల్లడింది. వారిని వెమురాయ్ తులసిరామ్, ఎస్ఆర్ నాగరాజులుగా ఇండియన్ అంబస్సీ గుర్తించింది. దీంతో మొత్తం 39 మంది విదేశీ పర్యాటకులు శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో అసువులు బాసినట్లు శ్రీలంక ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more