తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు శనివారం (ఏప్రిల్ 20) విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూలను ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం మూడు విడతల్లో.. మే 6న తొలి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు . మే 27న ఓట్ల లెక్కింపు చేపడతామని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 539 జడ్పీటీసీ స్థానాలు ఉండగా... ఒక స్థానానికి మాత్రం ఎన్నికలు జరగడం లేదని ఆయన అన్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
షెడ్యూలు ఇలా..
* మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల కానుండగా.. మే 6న ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 212 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
* రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 26న విడుదల కానుంది. మొత్తం 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు.
* ఇక మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. మూడో విడతలో భాగంగా 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు మే 14న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆన్లైన్ ద్వారా నామినేషన్ల సమర్పణ..
ఈసారి ఆన్లైన్లో విధానంలోనూ నామినేషన్ దాఖలుచేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఆ తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్ హార్డ్కాపీలను రిటర్నింగ్ అధికారికి ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
40 ఎంపీటీసీ స్థానాల్లో నో ఎలక్షన్..
సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని.. అయితే, ఫలితాల తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు. 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా... జడ్చర్ల లోని 15 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది మే నెలలో టర్మ్ ముగిస్తుందని.. భద్రాచలం జిల్లాలోని బుర్గంపాడులో 11 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది జులైతో టర్మ్ ముగుస్తుందని.. లీగల్ కారణాల వల్ల ములుగులోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల భద్రత కోసం 26 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు నాగిరెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more