tamilnadu cm edappadi palaniswami gives cash to voters in salem ఓటర్లకు స్వయంగా డబ్బులు ఇచ్చిన సీఎం పళనిస్వామి

Tamilnadu cm edappadi palaniswami caught on camera giving cash to voters in salem

palanisamy campaign in salem, edappadi palanisamy gives money, edappadi palanisamy give money to vendors, edappadi palanisamy, Cash for vote, aiadmk, edappadi palanisamy, election campaign, money, banana vendors, Cash for vote, aiadmk, salem, TamilNadu

Tamilnadu chief minister edappadi palaniswami caught red handedly on camera giving cash to voters in salem while campagning for the aiadmk party candidate.

ITEMVIDEOS: ఓటర్లకు స్వయంగా డబ్బులు ఇచ్చిన సీఎం పళనిస్వామి

Posted: 04/17/2019 06:21 PM IST
Tamilnadu cm edappadi palaniswami caught on camera giving cash to voters in salem

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఓటరుకు డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా మీడియా కెమెరాలకు చిక్కారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ నెల 18న జరగనున్న రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటరుకు ఆయన పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా పంపిణీ చేయడంపై పెను దుమారం రేగుతోంది. విపక్షాల అభ్యర్థుల ఇళ్లపై, కార్యాలయాలు, అనుచరుల ఇళ్లు, ఆపీసులపై దాడులు నిర్వహించే ఈసీ అధికారులు, ఐటీ అధికారులు.. అధికార పక్షంలో అందులోనూ బీజేపితో కూటమికట్టిన పార్టీలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగిందీ అంటే.. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సీఎం పళనిస్వామి సేలంలోని ప్రచారం నిర్వహించకుండా కేవలం అక్కడి ఓటర్లను మాత్రం తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ.. పార్టీ కరపత్రాలను పంచుతూ.. స్థానికులకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. ఈ క్రమంలో అదే రోడ్డుపై ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లిన పళనిస్వామి అక్కడున్న మహిళతో మాట్లాడుతూ తమకు ఓటేయాలని కోరారు. సీఎం తన వద్దకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి అమెకు తమ పార్టీ కరపత్రాన్ని ఇచ్చారు.

ఆ తరువాత వెంటనే వెనుకనున్న వ్యక్తి అందించిన డబ్బును అదే పాంప్లెట్లలో పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎం ఇచ్చిన డబ్బును ఆ మహిళ వద్దని చెబుతున్నా ఆయన వినిపించుకోకుండా ముందుకు కదిలారు. సీఎం పళనిస్వామి డబ్బులు ఇస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కి అనంతరం సోషల్ మీడియాకు ఎక్కింది. ఓటుకు నోటు అన్న విధంగా స్వయంగా ముఖ్యమంత్రే డబ్బులు పంచుతున్నా.. ఈసీ అధికారులకు కనిపించడం లేదా.? లేక తమ వాళ్లు డబ్బు పంచినా అది నేరం కాదన్నట్లు ఈసీ వ్యవహరిస్తోందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల, పార్టీ నేతల, వారి అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏమీ లేకపోయినా.. కేవలం వారిని సమయాన్ని వృధా చేయడంతో పాటు ప్రజల్లో ఒకింత అనుమానాలను వెదజల్లే విధంగా ఈసీ అధికారులు, ఆదాయపన్నుశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని తమిళనాడు విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇక తేని జిల్లాలోని అన్నాడీఎంకే కార్యాలయంలో పోలీసులు రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : edappadi palanisamy  election campaign  money  banana vendors  Cash for vote  aiadmk  salem  TamilNadu  

Other Articles