హైదరాబాద్ నగరం నుంచి కొంత దూరంలో సినిమా షూటింగ్ లో పాల్గోని తిరిగి వస్తున్న నటీమణులకు ఆ ప్రయాణమే చిట్టచివరిదైంది. ఓ సీరియల్ షూటింగ్ నిమిత్తం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లిన టీవీ సిరియల్ బృందంలోని నటీమణుల కారు.. తిరుగుప్రయాణమై వస్తున్న వేళ, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొనింది. దీంతో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం చేవెళ్ల సమీపంలోని అప్పారెడ్డి గూడ బస్టాప్ వద్ద జరిగింది.
మోయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ టీవీ సీరియల్ లో నటిస్తున్న భార్గవి (20), అనుషా రెడ్డి (21)లు షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ కు తిరుగుపయనం అయ్యారు. సరిగ్గా అప్పారెడ్డి గూడ వద్దనున్న మలుపులో అత్యంత వేగంగా ఎదురుగా దూసుకువచ్చిన లారీని గమనించిన డ్రైవర్ చక్రీ.. వెంటనే అప్రమత్తమై కారును పక్కకు తిప్పగా, అదుపు తప్పి కారును ఢీకొనింది. ఈ ఘటనలో నిర్మల్ కు చెందిన భార్గవి (20), భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) మరణించారు.
కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారని.. వారిలో కారు డ్రైవర్ చక్రితో పాటుగా నటిమణులతో కలసి ప్రయాణిస్తున్న వినయ్ కుమార్ లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. నటీమణుల మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరిలించామని చెప్పారు. ప్రమాదఘటనపై సమాచారం అందుకున్న ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more