టీడీపీ నేత, సిట్టింగ్ అంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాద్ పై సరిగ్గా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన ఈ నెల 11న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై హత్యాయత్నంతో పాటు భారత శిక్షాస్మృతిలోని మరో 10 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు.
ఎన్నికల రోజున పోలింగ్ జరుగుతున్న క్రమంలో పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులు ఎలా వున్నాయన్న విషయమై పరిశీలించేందుకు వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అంబటి వర్గీయులు కుట్ర పన్నారని, ఆయన వస్తున్న సమాచారం అందుకుని మార్గమధ్యంలోనే అతనిపై దాడికి యత్నించారని, అతని కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారని టీడీపీకి చెందిన పలువురు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిర్యాదును అందుకున్న పోలీసులు కేసును నమోదు చేశారు.
ఈ దాడికి అంబటి రాంబాబు కుట్ర పన్నారని ఆరోపిస్తూ వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామని సత్తెనపల్లి డీఎస్పీ పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం పోలీసులు సేకరించారు. కోడెలపై దాడి జరిగిన సమయంలో పోలింగ్ బూత్ లో ఉన్న అధికారుల నుంచి, స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more