సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ ప్రజలపై అనేకానేక ఎన్నికల హామీలను గుప్పిచింది. మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. బీజేపి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, కీలక నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘సంకల్ప్ ప్రత్’ పేరిట ఈ మేనిఫెస్టో రూపొందించింది.
గత ఎన్నికలలో మార్పు కోసం అన్న పేరుతో తీసుకువచ్చిన మేనిఫెస్టోలో అవినీతి నిర్మాలణ, గుజరాత్ మోడల్ అభివృద్ది, నిత్యావసర సరుకుల ధరల స్థీరీకరణ, నల్లధనం నిర్మూలణ, విదేశాల్లో నల్లధనం దేశానికి తీసుకువచ్చే ప్రధాన అంశాలను పోందుపర్చిన బీజేపి.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా పలు అంశాలను తీసుకువచ్చారు. మరీ ముఖ్యంగా ఉగ్రవాద నిర్మూలన అంశాన్ని పోందుపర్చడంతో పాటు రైతులను ప్రసన్నం చేసుకునేందుకు రైతులకు పెన్షన్ విధానాన్ని తమ ఎన్నికల హామీలలో ప్రముఖంగా పోందుపర్చారు.
బీజేపి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
* పేద, మధ్య తరగతి రైతులకు పెన్షన్లు.
* రైతులకు వడ్డీ లేని రుణాలు
* జీరో పర్సెంట్ క్రెడిట్ కార్డులు.
* ఐదేళ్ల పాటు వడ్డీ లేకుండా లక్ష రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డులు.
* 60 ఏళ్లు దాటిన రైతులు, చిన్న వ్యాపారులకు ఫించన్.
* పౌరసత్వం బిల్లుకు త్వరలో ఆమోదం.
* ఎలాంటి గుర్తింపు లేకున్నా పౌరసత్వానికి ఆమోదం.
* ఉగ్రవాదం నిర్మిలిస్తాం.
* సిటిజన్ షిప్ సవరణ బిల్లును ఆమోదిస్తాం.
* రామమందిరం నిర్మాణం త్వరగా అయ్యేలా చూస్తాం.
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం.
* డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్ అమలు.
* నీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం.
* యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
* అందరికీ ఉన్నత విద్య అందేలా ఏర్పాట్లు.
* అందరికీ విద్య. 75 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తాం.
* ప్రజల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల సంఖ్యను పెంచుతాం.
* ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సింగిల్ విండో సిస్టం తీసుకొస్తాం.
* డిజిటల్ లావాదేవీలు పెంచుతాం.
* పంచతీర్థాల సర్క్యూట్ పూర్తి చేస్తాం.
* మహిళలకు ఉద్యోగ కల్పన పెంచుతాం.
* ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లిం మహిళలకు న్యాయం.
* 25 లక్షల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు.
* రైతులందరికీ పెట్టుబడి సాయంగా రూ. 6వేలు ఇస్తాం.
* రైతులకు వడ్డీ లేకుండా రుణాలు
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
* జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు
* చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
* జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు
* జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు
* దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అమలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more