మానవత్వం గురించి నేతలు మాటలు చెబితే కోటలు కూడా బద్దలవుతాయన్నది తెలిసిన విషయమే. ఎందుకంటే నేతలు మాటల్లో తప్ప అచరణ మానవత్వంతో వ్యవహరించరని విమర్శలున్నాయి. మథుర బీజేపి ఎంపీ నటి హేమమాలిని కారు ప్రమాదంలో డాక్టరు కారును ఢీకొన్న ఘటనలో బాధితులు ఇలాంటి అరోపణలే చేశారు. అయితే వారిపై కాసింత కూడా మానవత్వం లేకుండా తమ తండ్రికి సాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోకుండా అమె వ్యవహరించిందని బాధితులు అరోపించిన విషయం తెలిసిందే.
ఇక కేంద్రమంత్రి, టీవీ నటి, రాజ్యసభ సభ్యురాలు సృతిఇరానీ కాన్వాయ్ లోని ఓ వాహనం మరో వాహనాన్ని ఢికొన్న ఘటనలో క్షతగాత్రులకు స్వయంగా సాయం అందించాల్సిన మంత్రి.. అలా చేయకుండా వెళ్లిపోయిందని.. అమెపై విమర్శలు వెల్లివిరిసిన క్రమంలో.. తాను వారికి సాయం చేయడానికి అంబులెన్సుకు ఫోన్ చేసి పంపించానని.. దాంట్లోనే వారు అసుపత్రికి వెళ్లారని అమె చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలతో నేతలు అంతా ఒకేటే పాఠం చదివారని, వారు ప్రసంగాలు చేయడానికే తప్ప.. అచరించడానికి కాదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో నెలకొంది.
అయితే అందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం మినహాయింపు అన్నది ఇప్పటికీ పలు ఘటనల ద్వారా నిరూపితమైంది. యూపీ ఎన్నికల సమయంలో అమేధీలో ప్రచారం ముగించుకుని తిరుగుపయనమైన రాహుల్ గాంధీకి రోడ్డు ప్రమాదంలో ఓ వాహనదారుడు రక్తమోడుతూ కనిపించగానే అదే సమయంలో తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో క్షతగాత్రుడిని అసుపత్రికి పంపించారు రాహుల్ గాంధీ. అయితే అదే సమయంలో పలు ఘటనలు చోటుచేసుకోవడంతో.. రాహుల్ మానవత్వం హైలైట్ అయ్యింది.
@INCIndia अध्यक्ष @RahulGandhi ने घायल पत्रकार राजेन्द्र व्यास की मदद कर दिया इंसानियत का परिचय, सच दयालु व्यक्ति है राहुल गांधी @ashokgehlot51 @SachinPilot @priyankac19 @rssurjewala @VineetPunia @pranavINC pic.twitter.com/TYxqRhxPS9
— Vivek Barmeri (@Viveksbarmeri) March 27, 2019
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఓ ఫోటో జర్నలిస్టు కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తూ పొరపాటున మెట్లు జారి కిందకు పడుతుండగా చెయ్యందించి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆయన మరోసారి మానవత్వం చాటుకుని వార్తల్లో నిలిచారు. రాహుల్ తన వాహనంలో వెళుతుండగా రోడ్డుపై గాయపడిన రాజేంద్ర వ్యాస్ అనే జర్నలిస్టును చూశారు. వెంటనే కారు ఆపి ఆయనను తన కారులో ఎక్కించుకుని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజేంద్ర వ్యాస్కు నుదుటికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. రాజస్థాన్ కి చెందిన వ్యాస్, సెంట్రల్ ఢిల్లీలోని హనుమాన్ రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. రాహుల్ సిబ్బంది రక్తమోడుతున్న వ్యాస్ ను కారులో ఎక్కించుకొని పోవడం కనిపిస్తోంది.
The media person - Rajendra Vyas who was helped by @RahulGandhi after he met with an accident has been discharged @INCIndia pic.twitter.com/8BGdQK0n6Y
— Inc KR Puram (@inckrpuram) March 27, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more