సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. అవినీతి అక్రమాలకు తావు లేకుండా దేశంలో తమ ప్రభుత్వం పాలనను అందిస్తుందని ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీకి చెందిన జాతీయ కీలక నేతపై చీటింగ్ కేసు నమోదు కావడం సర్వత్రా చర్యనీయాంశంగా మారింది. తెలంగాణ నుంచి బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన పి.మురళీధర్ రావుతో పాటు మరో ఎనిమిది మందిపై రాచకోండ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసం చేశారన్న ఆరోపణలతో ఆయన మీద కేసు పెట్టారు. రూ.2.17 కోట్లకు ఆ రియల్టర్ను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు మహిపాల్ రెడ్డి భార్య ప్రవర్ణ రెడ్డి ఫిర్యాదుతో కోర్టు ఆదేశాల ప్రకారం మురళీధర్ రావు మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఫార్మా ఎగ్జిల్ చైర్మన్ పదవిని ఇస్తామని ఆశ చూపించి మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి వద్ద మురళీధర్ రావు రూ.2.17 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
మహిపాల్ రెడ్డి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని కూడా నిందితులు ఫోర్జరీ చేశారని, ఆమె పేరుతో అపాయింట్ మెంట్ లెటర్ ను కూడా సృష్టించారని ఫిర్యాదు చేశారు. దీంతో మురళీధర్ రావుతో పాటు మరో ఎనిమింది మంది నిందితులపై చీటింగ్, ఫోర్జరీ, ఉద్దేశపూర్వక కుట్ర వంటి కేసులను నమోదు చేశారు రాచకోండ కమీషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీసులు.
కాగా, ఈ కేసుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని మురళీధర్ రావు తెలిపారు. ఆ ఫిర్యాదులో ఉన్నవన్నీ నిరాధారమైనవని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి, తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి మీద తాను 2016 ఆగస్ట్ 24న ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చినట్టు ఓ ట్వీట్లో తెలిపారు. హైదరాబాద్, తిరుపతిలో కూడా బీజేపీ నేతలు దీనిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు.
Statement regarding the filed FIR. pic.twitter.com/HALxd7nS7s
— Chowkidar P Muralidhar Rao (@PMuralidharRao) March 27, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more