జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగనున్న అసెంబ్లీ అభ్యర్ధుల ఐదో జాబితాలలో వినూత్న శైలిని కనబర్చారు జనసేనాని పవన్ కల్యాణ్. అధికారమే పరమావధిగా అన్ని పార్టీలో లె్క్కలు వేసుకుంటూ.. ప్రతీ స్థానంలోనూ అటు అంగబలం, ఇటు అర్థబలంతో పాటు సామాజిక సమీకరణలు సరిచూసుకుంటూ బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతూ అన్ని రాజకీయ పార్టీలు ముందుకుసాగుతున్న క్రమంలో.. తాను ఓట్ల కోసం కాదు.. సీట్ల కోసం కాదు.. అధికారం కోసం అసలే కాదు అని అది నుంచి పిలుపునిస్తున్న జనసేనాని మార్పుల కోసం అంటూ నినదిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో తాను అశించిన మార్పులో భాగంగా విద్యావేత్తలకు, సామాజిక వేత్తలకు, విద్యావంతులకు, మహిళలకు అధికస్థానాలను కేటాయించిన పవన్.. అధికంగా మధ్యతరగతి వర్గాలకు చెందినవారికే టికెట్లను కేటాయించారు. నాలుగు జాబితాల్లో 90 మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా తన ఐదవ జాబితాలోనూ ను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తంగా 16 మందికి టికెట్లను కేటాయించగా, అందులో సామాన్య రైతు కూలికి, మాజీ అర్టీసీ కండక్టర్ తనయులకు కూడా టికెట్లు కేటాయించి పవన్ అంటే ఏంటో మరోమారు చాటుకున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం టిక్కెట్ను గొంగడ గౌరీ శంకరరావు అనే యువకుడికి ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరీ గౌరీశంకరరావు అనుకుంటున్నారా? ఆయన ఓ సామాన్య రైతు కూలీ బిడ్డ. గౌరీ శంకరరావు తండ్రి గుంపస్వామి వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా, తల్లి అప్పాయమ్మ కూరగాయలు అమ్ముతోంది. తొలి నుంచీ జనసేన పార్టీలో పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించిన పవన్.. గౌరీశంకరరావుకు టిక్కెట్ కేటాయించారు.
పవన్ నిర్ణయంపై ఆయన అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టిక్కెట్ను కూడా పవన్ తన అభిమాని గేదెల చైతన్య అనే యువకుడికి కేటాయించారు. రిటైర్ట్ ఆర్టీసీ కండక్టర్ కొడుకైన చైతన్య సీఎ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కళ్యాణ్ గళమెత్తిన సమయంలో చైతన్య ఆయనకు అన్నివిధాలా అండగా నిలిచారు. దీంతో పవన్ పాతపట్నం టిక్కెట్ను చైతన్యకు కేటాయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more