రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు. ఇవాళ ఆయన తన కుమార్తె సుజలతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి కొన్నాళ్ల కిందట టిడీపీలో చేరారు.
కాగా, ఆయన తాజాగా జనసేనలో చేరారు. ఎస్పీవై రెడ్డితో పాటు ఆయన తనయ సుజలను కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సాధరంగా పార్టీలోకి అహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీలో సభ్యత్వం కల్పించారు. టీడీపీ పార్టీ తనను మోసం చేసిందని కంటతడి పెట్టిన ఆయనను జనసేన అక్కున చేర్చకుంది. ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన స్వతంత్రగా బరిలోకి దిగి సత్తాచాటుతానని సవాల్ చేశారు.
టీడీపీ నంద్యాల ఎంపీ టికెట్ ను మాండ్ర శివానందరెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీవై రెడ్డిని జనసేన నేతలు కలసి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. జనసేన నాయకుల ప్రణాళికలు ఫలించడంతో ఆయన పార్టీలో చేరేందుకు సంసద్దత వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి వంటి బలమైన నేతను పార్టీలోకి రావడంతో నంద్యాల ఎంపీ స్థానంలో కూడా త్రిముఖ ఫోటీ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more