SPY Reddy to contest for a Lok Sabha seat జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి.. ఎంపీ అభ్యర్థిగా పోటీ..

Spy reddy joins janasena set to contest for a lok sabha seat

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy, Pawan Kalyan SPY Reddy kurnool, SPY Reddy JanaSena, SPY Reddy kurnool, SPY Reddy, kurnool parliamentary constituency, andhra pradesh, politics

This is big shock to TDP party as the noted politician and industralist SPY Reddy joins Janasena party and set to contest from nandyal Lok Sabha seat.

జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి.. ఎంపీ అభ్యర్థిగా పోటీ..

Posted: 03/20/2019 09:49 PM IST
Spy reddy joins janasena set to contest for a lok sabha seat

రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు. ఇవాళ ఆయన తన కుమార్తె సుజలతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి కొన్నాళ్ల కిందట టిడీపీలో చేరారు.

కాగా, ఆయన తాజాగా జనసేనలో చేరారు. ఎస్పీవై రెడ్డితో పాటు ఆయన తనయ సుజలను కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సాధరంగా పార్టీలోకి అహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీలో సభ్యత్వం కల్పించారు. టీడీపీ పార్టీ తనను మోసం చేసిందని కంటతడి పెట్టిన ఆయనను జనసేన అక్కున చేర్చకుంది. ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన స్వతంత్రగా బరిలోకి దిగి సత్తాచాటుతానని సవాల్ చేశారు.

టీడీపీ నంద్యాల ఎంపీ టికెట్ ను మాండ్ర శివానందరెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీవై రెడ్డిని జనసేన నేతలు కలసి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. జనసేన నాయకుల ప్రణాళికలు ఫలించడంతో ఆయన పార్టీలో చేరేందుకు సంసద్దత వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి వంటి బలమైన నేతను పార్టీలోకి రావడంతో నంద్యాల ఎంపీ స్థానంలో కూడా త్రిముఖ ఫోటీ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  SPY Reddy  kurnool lok sabha  andhra pradesh  politics  

Other Articles