తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే టఆర్ఎస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్తో చర్చించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానని ఎమ్మెల్యే హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ మేరకు తాను కేటీఆర్ తో సమావేశమైన తరువాత శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు - రంగారెడ్డి ముంపు బాధితులకు నష్ట పరిహారం, మాదాసి, కుర్వ వర్గాల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరానని అయితే అన్నింటినీ పరిశీలించి న్యాయం చేస్తామని కేటీఆర్ తమకు హామి ఇచ్చినట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్ వివరించారు.
సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ది కోసమే తాను పార్టీని మారుతున్నట్లు చెప్పిన హర్షవర్థన్.. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలమూరు (ఉమ్మడి మహబూబ్ నగర్) నుంచి మొత్తం 14 స్థానాలకు గాను కాంగ్రెస్కు ఒకే ఒక స్థానం దక్కింది. అది కొల్లాపూర్. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరనుండటం గమనార్హం.
‘కేసీఆర్పై విశ్వాసంతో ఆ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నా. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నా. తిరిగి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి కూడా సిద్ధం. నియోజకవర్గ ప్రజలు, నా అభిమానులతో చర్చించిన తర్వాతే టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకున్నా’ అని హర్షవర్ధన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more