నాగోల్ నుంచి హైటెక్ సిటీ మెట్రో రైలు మార్గం మెట్రో రైలు సర్వీసులు పట్టాలెక్కాయి. ఇప్పటి వరకు కేవలం అమీర్ పేట్ వరకు మాత్రమే అందుబాటులో వున్న సర్వీసులు ఇకపై హైటెక్ సిటీ వరకు సాగనున్నాయి. ఇవాళ అమీర్ పేట్ హైటెక్ సిటీ మార్గంలోని మెట్రో రైల్ ను అమీర్ పేట స్టేషన్ లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ మార్గంలోని ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రూట్ లోనూ ప్రయాణించేందుకు నగరవాసులు ఉవ్విళ్లూరుతున్నారు. అటు సాధారణ ప్రయాణికులతో పాటు ఇటు సాప్ట్ వేర్ ఉద్యోగులు కూడా ప్రయాణం కోసం పోటీ పడుతున్నారు. దీంతో నాగోల్ నుండి శిల్పారామం వరకు ఉన్న కారిడార్ 3 మొత్తం 27 కిలో మీటర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ కారిడార్లో ఇప్పటికే నాగోల్ నుండి అమీర్పేట్ వరకు సర్వీసులు నడుస్తుండగా... ఇప్పుడు అమీర్పేట్ నుంచి శిల్పారామం వరకు మెట్రో సర్వీసులు పొడిగించనున్నారు.
అమీర్పేట్-హైటెక్ సిటీ మధ్య దూరం 10 కిలో మీటర్లు. ఈ మార్గంలో మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉండగా... ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ మెట్రో స్టేషన్ల మెట్రో రైలు ఆగదు. కొన్ని వారాల తర్వాత ఈ మూడు స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more