అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోంశాఖ… రక్షణశాఖను కోరింది. మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. మనోహర్ పారికర్ పార్థివదేహాన్ని ప్రస్తుతం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకురాగా... పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కడసారి చూపుకోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు బారులు తీరారు.
ఆ తర్వాత పార్థివ దేహాన్ని కళా అకాడమీకి తీసుకుని వెళ్ళారు. సాయంత్రం 4 గంటల వరకు కళా అకాడమీలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంతిమయాత్ర కొనసాగుతుందని ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారని బీజేపి నేతలు తెలిపారు. పారికర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి.
పారికర్ మృతికి సంతాప సూచకంగా ఇవాళ జాతీయ సంతాప దినాన్ని కేంద్రం పాటిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జెండాను అవనతం చేశారు. గోవాకు 3 సార్లు సీఎం గా పని చేసిన మనోహర్ పారికర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ సారి గోవాలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి పారికర్ మాత్రమే కావాలంటూ అక్కడి భాగస్వామ్య పార్టీలు కోరడంతో.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్.. గోవా ముఖ్యమంత్రిగా మరోమారు బాద్యతలు చేపట్టారు. గతేడాది మార్చిలో క్లోమగ్రంధి కేన్సర్ బారిన పడి చికిత్స పొందుతూ ఆదివారం మార్చి 17, 2019న తుది శ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more