కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో కాపు జేఏసీ నేతలతో టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత సమావేశం అయినట్టు సమాచారం. టీడీపీలో చేరితే ముద్రగడ పద్మనాభం కుమారుడు చల్లారెడ్డికి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అంశంపై చర్చించినట్టు తెలిసింది. కాపులకు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ హామీలను పట్టించుకోవడం లేదని ఆయన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లేఖాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తమ రిజర్వేషన్లు ఏక్కడా.. అని నినదిస్తూ తునిలో భారీ బహిరంగసభను కాపుగర్జన పేరుతో ఏర్పాటు చేశారు. కాగా తుని ఘలనను కొన్ని సంఘవిద్రోహ శక్తులు విచ్చిన్నం చేయాలని చూశాయి. తుని రైల్వే జంక్షన్ లో వున్న రైలుకు నిప్పుబెట్టాయి.
అయితే ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన అన్ని దీక్షలను టీడీపీ ప్రభుత్వం భగ్నం చేసింది. కిర్లంపూడిలోని ఆయన ఇంటిలోనే ఆయనను గృహనిర్భంధం చేసింది. ముద్రగడ దీక్ష తలపెట్టిన ప్రతీసారి కిర్లంపూడి ప్రాంతం అప్రకటిత కర్ఫ్యూను తలపించింది. పద్మనాభంను అరెస్ట్ చేయడం, ఆయన కుటుంబసభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే, ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరకుండా కుమారుడు చల్లారావును మాత్రమే టీడీపీలో చేర్చే అంశం ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఆయనకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకుగాను ఆయన రాష్ట్రమంతా తిరిగి తమ పార్టీ తరుపున ప్రచారం చేయాలని ముద్రగడను కోరినట్టు తెలుస్తుంది. అయితే ముద్రగడ కాపు జేఏసీల విషయమై టీడీపీ నేతలను ప్రశ్నించారని.. దీంతో మరోసారి మాట్లాడుదామని వారు వెళ్లిపోయినట్టు సమాచారం. మొత్తం మ్మీద ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను పూర్తి స్థాయిలో రాబట్టే దిశగా టీడీపీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more