తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీల మధ్య విబేధాలు ఉంటాయని, అంతమాత్రన అందులో వేలు పట్టొద్దని పవన్ కల్యాణ్ కోరారు. ‘కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దెబ్బతిన్న రాష్ట్రం. మళ్లీ అందులో వేలుపెట్టొద్దు. ఏవో చిన్నపాటి గొడవలు ఉంటాయి. అంతమాత్రన మీరు రాష్ట్రంలోకి వచ్చి మళ్లీ పాతగొడవలు లేపొద్దు. మానుతున్న గాయాలను వదిలేయండీ, దయచేసి ఆంధ్రులను వదిలేయండి. మీకు దండంపెడతా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీలతో ఎక్కువ పరిచయం ఉందని అన్నారు. అయితే, వారికి తాను దూరం జరిగితే జగన్ మోహన్ రెడ్డి వెళ్లి వారితో స్నేహం చేయడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. ‘బీజేపీ మనల్ని బాగా దెబ్బకొట్టింది. మనం బీజేపీకి భుజం మోస్తే ఆ పార్టీ దొడ్డిదారిలో వైసీపీకి అండగా నిలుస్తోంది. బీజేపీతో స్నేహంపై వైసీపీ తన వైఖరి స్పష్టం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ తనకు కావాల్సిన వ్యక్తని.. అలాగే.. హరీశ్ రావు కూడా కావాల్సిన వ్యక్తి. అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను వారితో కలిసి లేనని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో తన పార్టీతో పాటు అటు టీడీపీ, ఇటు వైసీపీలు పోటీ చేస్తున్నాయని, తనతో పాటుగా ఎన్నికల రణక్షేత్రంలో చంద్రబాబు, జగన్ ముగ్గురం పోటీలో వున్నామని అన్నారు. ఇంతవరకే దీనిని పరిమితం చేద్దామని అన్న పవన్... ఛీకొట్టిన తెలంగాణ నాయకులను ఏపీకి తేవొద్దని జగన్ కు సూచించారు.
ఆంధ్రుల అభిమానం దెబ్బతీసిన వ్యక్తితో కలసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడగలరు?’ అని పవన్ కల్యాణ్.. వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు మీద కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ‘పదే పదే మాటలు మార్చినందుకు చంద్రబాబు పశ్చాత్తాపపడాలన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలిచేయొద్దని సూచించారు జనసేనాని పవన్ కల్యాణ్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more