kakinada city janasena activists in full josh కాకినాడ సిటీలో ముత్తా గెలుపు తథ్యం..

Kakinada city janasena activists in full josh as mutha shasidhar gets ticket

pawan kalyan, janasena, kakinada city assembly constituency, Former Mla mutha gopalakrishna, mutha shasidhar, janasena activists, assembly candidates first list, janasena assembly candidates first list,stratagic selection, jana sena contestants, andhra pradesh election 2019, andhra pradesh, politics

Former Mla and noted businessman from kakinada city Mutha Gopala Krishna Elder son mutha shasidhar gets Janasena assembly ticket from kakinada city. Janasena activists says that mutha is the winning candidate.

కాకినాడ సిటీలో ముత్తా గెలుపు తథ్యం..

Posted: 03/14/2019 04:14 PM IST
Kakinada city janasena activists in full josh as mutha shasidhar gets ticket

జనసేన పార్టీ తమ ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించిన తొలి జాబితాలో కాకినాడ సిటి అసెంబ్లీ నుంచి వ్యాపారవేత్త, పాత్రికేయుడు ముత్తా శ‌శిధ‌ర్ పేరును ప్రకటించడం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి తొలి విజయం అందుకునే వ్యక్తి కూడా ముత్తా శశిధర్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముత్తా శశిధర్ తండ్రి ముత్తా గోపాల కృష్ణ మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఈ ప్రాంతంలో సేవలందించారు. దీంతో ఆయన వారసుడిగా శశిధర్ కూడా విజయాన్ని అందుకుంటారని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ సిద్దాంతాలు నచ్చి.. అవినీతి లేని పారదర్శక పాలనను ప్రజలకు అందించాలన్న సంకల్పాన్ని మెచ్చిన ముత్తా శశిధర్.. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొన‌సాగుతున్నారు.. తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల‌లో ఆయ‌న క్రీయా శీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. స‌చ్చిలుడు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే నేత‌గా జిల్లాలో మంచి పేరు ఉండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే కాకినాడ సిటీలోని ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇప్పటికే కాకినాడ సిటీ సహా తూర్పు గోదావరి జిల్లాలో జ‌నసేన భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో శ‌శిధ‌ర్ త‌న‌దైన ముద్ర వేశారు. దీంతో శ‌శిధ‌ర్ కు కాకినాడ సిటి నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల్పించారు. దీంతో జనసేన సైనికులతో పాటు కాకినాడ పట్టణంలోని ప్రముఖులు కూడా శశిధర్ కు అసెంబ్లీ సీటు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. శశిధర్ గెలుపు ఖాయమని, అయనకు బ్రహ్మాండమైన మెజారిటీని అందించేందుకు తాము కృషి చేస్తామని జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు, ముత్తా అనుచరగణం పేర్కోంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Mutha shasidhar  kakinada city  andhra pradesh  politics  

Other Articles