సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసి అప్పుడే మూడు రోజులు కావస్తున్నా.. పార్టీలు తమ అబ్యర్థుల జాబితాలను వెలువరించడంలో మాత్రం ఇంకా అనేక తర్జనభర్జనలు పడుతున్నాయి. కాగా, అధికార పార్టీ యువనేత నారా లోకేష్.. తొలిసారిగా ప్రజాక్షేత్రంలో ఎన్నికల బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో.. పలు స్థానాలు తెరపైకి వచ్చిన తరువాత తాజాగా క్లారిటీ ఇచ్చింది టీడీపీ.
తొలుత నారా వారి రాజకీయ వారసుడు ఉత్తరాంధ్ర నుంచే బరిలో దిగుతారని టీడీపీ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయి. నారా లోకేష్ విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి లేదా విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగుతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే భీమిలి స్థానాన్ని సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కోసం రిజర్వు చేయగా, ఇక విశాఖ ఉత్తరంపై దృష్టి పెట్టిన గంట.. తాను ఎంపీ బరిలో నిలువనని కూడా చంద్రబాబు వద్ద స్పష్టం చేశారని సమాచారం.
ఈ క్రమంలో అన్ని ఈక్వేషన్స్ సరిచూసుకున్న టీడీపీ అధిష్టానం.. తాజా సమీకరణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంపై కూడా తమ జెండా ఎగురువేయాలని.. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని నారా లోకేష్ కు కేటాయించారు. తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్న నారా లోకేష్.. మంత్రి పదవిని చేపట్టడంపై ఇప్పటికే విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో మంగళగిరి నుంచి గెలిచి రాజధానిపై టీడీపీ జెండాను ఎగురవేయాలని టీడీపీ అధిష్టానం నారా లోకేష్ ను ఈ స్థానం నుంచి బరిలో దింపుతుంది.
టీడీపీ కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గం గత ఎన్నికలలో కేవలం 12 ఓట్లతో తేడాతో టీడీపీ ఓటమి పాలైయ్యింది. ఇక్కడి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల బరిలో నిలిచి గెలుపోందారు. బిసీ ఓటర్లు అత్యధికంగా వున్న మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచే నారా లోకేష్ వారిని ఎలా అకర్షిస్తారు.? తమ పార్టీలోని నేతలందరినీ కలుపుకుని వెళ్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మరి నారా వారి రాజకీయ వారసుడు.. ఎప్పట్నించి ప్రచార బరిలో దిగుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more