సార్వత్రిక ఎన్నికలకు నెల రోజులు కూడా లేని ఈ తరుణంలో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు వివిధరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికార టిడిపిలు ఈ పనిలో ముందున్నాయి. ఏదో విధంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, వారిని ఆకర్షించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిదారులను వెతుక్కుంటోంది.
తమ సొంత పత్రికలో తమకు అనుకూలంగా వార్తలు రాయించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా కథనాలను, వార్తలను ప్రచురించింది. అయితే ఇకపై కూడా అదే స్ట్రాటజీ ప్లే చేయాలని భావిస్తున్న పార్టీ.. ఇక సరికొత్త విధమైన అలోచనను చేసింది. తమ పత్రిక కాబట్టి తమ అభ్యర్థులకు విరివిగా ప్రచారం చేయడంతో పాటు ఇకపై తమ పేపర్ను ఉచితంగా సరఫరా చేయాలని కూడా భావిస్తోందని సమాచారం. నగరాల్లోని పార్కులు, టీ స్టాల్స్, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో ‘సాక్షి’ పేపర్లను ఉచితంగా పంచాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఏకంగా లక్షల సంఖ్యలో ‘సాక్షి’ దినపత్రికను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ నగరాల్లో ఉదయాన్నే మార్నింగ్ వాక్కు వెళ్లేవారిని టార్గెట్ చేసుకుని.. వారికి ఆ పత్రికను ఉచితంగా ఇస్తున్నారు. మరికొన్ని పార్కుల్లో బెంచీలపై పడవేసి వెళ్లిపోతున్నారు. రోజుకు లక్షల కాపీలను ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా లేదని ఈ సంఘలనలు స్పష్టం చేస్తున్నాయి.
ఉచితంగా దినపత్రికను పంచడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత.. ఉచితంగా పేపర్ ను పంచడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నాయకులు స్పందించడం లేదు. కాగా, ఎన్నికల సమయంలో ఈ విధంగా ఒక ప్రధాన పత్రికను ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పత్రుల వివరాలను సేకరించి ఈ ఖర్చులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more