జమ్మూకాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషై మహమ్మద్ సంస్థ మావనబాంబుకు పాల్పడిన ఘటన విషాదం నుంచి దేశం కోలుకోకముందే.. అంతకన్నా తీవ్రస్థాయిలో మరో దాడికి ఐఎస్ఐతో కలసి అదే ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేస్తుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పూల్వామా దాడిని అంతర్జాతీయంగా అన్ని దేశాలు, అగ్రదేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఖండిస్తున్న సమయంలోనే మరోమారు భారీ స్థాయిలో ఉగ్రవాదులు కుట్రలు పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
పుల్వామా ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని మరింత రెచ్చిపోతూ దాడులకు ఐఎస్ఐతో కలసి కుట్రలు పన్నుతుందని తెలుస్తుంది. పుల్వామా దాడికంటే మరింత భారీ దాడి కోసం ప్రణాళిక రచించింది. ఈ నెల 16-17 మధ్య పాకిస్థాన్లోని జైషే మహ్మద్ అగ్రనేతలు- ఉగ్రవాదుల మధ్య ఈ మేరకు సంభాషణ జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
భారత భద్రతా దళాలపై మరింత పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడి నిర్వహించాలని ఉగ్రవాదులు ప్రణాళిక రూపొందించినట్టు చెబుతూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం తెలిపారు. అయితే, జమ్మూలో లేదంటే జమ్ముకశ్మీర్ బయట ఈ దాడికి జైషే కుట్ర పన్నినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం గతేడాది డిసెంబరులో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 21 మంది ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడినట్టు చెప్పారు. ఇందులో ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడైన అదిల్ అహ్మద్ దర్ పుల్వామా దాడిలో పాల్గొనగా, ఇంకా ఇద్దరు దాడికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more