ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి హత్యోదంతంలో తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. జయరాం హత్యకేసులో నిందితులను మూడు రోజుల పాటు పోలిస్ట్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించిన నేపథ్యంలో వారు తొలిరోజునే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను పోలీసుల విచారణలో తెలిపారని సమాచారం. హత్య అనంతరం జయరాం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని నల్లకుంట పోలిస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి సిఐ శ్రీనివాస్ కు దాదాపుగా 13 సార్లు ఫోన్ చేశానని అంగీకరించాడు.
ఆ తరువాత ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డికి ఫోన్ చేసి.. ఆయనతో హత్యకేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రాధేయపడ్డాడు. అయితే అందుకు ఆయన నిరాకరించారని కూడా సమాచారం. దీంతో ఆయన కారును, మృతదేహాన్ని విజయవాడలో వదిలేసిన రాకేష్ రెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్కు చేరకుని.. ఆ వెంటనే గోవాకు వెళ్లిపోయానని కూడా అంగీకరించాడు. ఇదిలా వుండగా, ఈ హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది.
ఈ కేసులో తొలుత ఆయన మేనకోడలు శిఖా చౌదరిని అనుమానించిన పోలీసులు.. ఆ తర్వాత ఆమె స్నేహితుడు రాకేశ్ రెడ్డి ఈ హత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. జయరాం భార్ పద్మశ్రీ అరోపణల నేపథ్యంలో ఈ కేసును సవాలుగా స్వీకరించిన హైదరాబాద్ పోలీసులు.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా, ఈ హత్య కేసులో ‘ఆ నలుగురు’ నటుడు సూర్య ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
రాకేశ్ రెడ్డికి సూర్య స్నేహితుడు కావడం, హత్యకు ముందు సూర్యతో ప్రసాద్ ఫోన్లో మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు ఈ కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు, గత నెల 30న అంటే హత్య జరిగిన రోజున రాకేశ్ ఇంటికి సూర్య వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో సూర్యను పిలిపించిన బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అతడిని విచారించారు. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్న మరికొందరిని నేడు విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more