మన దేశంలో గత సార్వత్రిక ఎన్నికలలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోనే.. ఎన్నికలు పెడితే బ్రిటన్, అమెరికాల్లోనూ కమలం వికసిస్తుందని ఎన్టీయే మిత్రపక్షమైన శివసేన వ్యంగంగా స్పందించింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన ప్రతిపక్షాలు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీవీప్యాట్ స్లిప్ లను కౌంటింగ్ చేసే పద్దతిని వినియోగించాలని లేదా పాత రోజుల్లో వినియోగించిన బ్యాలెట్ పద్దతిని అవలంభించాలని కోరాయి.
అయితే వారి డిమాండ్లకు తాజాగా ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన కూడా తోడైంది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే, అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుండే శివసేన, తమ అధికార 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ త్వరలోనే కనుమరుగై, అసలు నిజం తెలిసివస్తుందని అభిప్రాయపడింది. ఇవే ఈవీఎంలను వాడుతూ ఎన్నికలు జరిపితే ఎక్కడైనా బీజేపీ విజయం సాధిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సందించింది.
ఇటు మహారాష్ట్రతో పాటు అటు కేంద్రంలోని మోడీ సర్కారును టార్గెట్ చేసిన సామ్నా.. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించింది. ఈ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నావిస్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లోక్ సభ స్థానాన్ని కూడా తాము రానున్న ఎన్నికలలో గెలుచుకుంటామని ఇటీవల జరిగిన సభలో ప్రకటించిన నేపథ్యంలో దీనిపై సామ్నా కూడా అదేస్థాయిలో మండిపడింది.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి ఒక్క సీటు అధికంగా వస్తుందన్న సీఎం ధీమా వ్యక్తం చేసిన క్రమంలో.. శివసేన మాత్రం ఈ నంబర్ ఎంత తగ్గుతుందో ఎవరూ ఊహించని పరిస్థితి నెలకొందని, బీజేపీకి కష్టకాలం ముందుందని అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులు, ఇప్పుడు పునరాలోచించుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది. లేకుంటే ఇప్పటివరకూ స్నేహితులుగా ఉన్నవారంతా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more