జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా డాక్టర్ వి.పొన్ రాజ్ ను జనసేనాని పవన్ కల్యాణ్ నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఓ కార్యక్రమం నిర్వహించి, పొన్ రాజ్ ని అభినందించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ కు పొన్ రాజ్ అడ్వయిజర్ గా ఉండే వారని, అలాంటి వ్యక్తిని తమ పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా ఉండటం తనకు ఆనందాన్ని ఇస్తోందని అన్నారు.
తన అభ్యర్ధన మన్నించి పార్టీ కోసం పనిచేయడానికి అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమూల్యమైన ఆయన సలహాలు బడుగు, బలహీన వర్గాలను ఆర్ధికంగా అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆయన తోడ్పాటు ప్రభుత్వ పాలసీల్లో ప్రతిభింబించి సామాజికంగా అణగారిన వర్గాల భవిష్యత్తును మార్చడానికి దోహదపడుతుందని నేను నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ లో నాయకత్వ లక్షణాలు మెండు: పొన్ రాజ్
పవన్ కల్యాణ్ ని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని పొన్ రాజ్ అన్నారు. ఏపీపై ఉన్న ఆయన విజన్ ని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. కేవలం, రాష్ట్రమే కాకుండా దేశం అభివృద్ధి చెందాలన్న ఆలోచన పవన్ ది అని, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న పవన్ తో కలిసే పనిచేస్తానని అన్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ గురించి ఆయనకున్న విజన్ చాలా అద్భుతంగా ఉంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన ఆలోచనలూ, నిబద్దతా ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ మెంబెర్ గా అబ్దుల్ కలాం గారి అడ్వయిజర్ వి.పొన్ రాజ్ గారుhttps://t.co/VqhUeKw98m
— JanaSena Party (@JanaSenaParty) February 7, 2019
అబ్దుల్ కలామ్ అకాంక్షించినట్లుగా యువత రాజకీయాల్లోకి రావాలనీ దేశ అభివృద్ధికి పాటుపడాలన్న తపన కూడా పవన్ కళ్యాణ్ వుందన్నారు. జనసేనానిని ఫాలో చేస్తున్న వారినీ చూస్తుంటే అది నిజం అయ్యిందనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత మెండుగా ఉన్నాయన్నారు. రాష్ట్రం మాత్రమే కాదు ఆయన నేతృత్వంలో దేశం కూడా ఏ అభివృద్ధి చెందిన ఏ దేశానికీ తీసిపోనివిధంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more