ఎంతో ఇష్టపడి కొనుక్కునే చిన్నకార్లకు కూడా తమ లక్కీ నెంబర్ వచ్చేలా చూసుకుని.. అదీ ఫ్యాన్సీగా వుండేలా చూసుకుంటారు. ఇందులో ఓ వైపు న్యూమరాలజీని కూడా జోడిస్తారు.. దాంటో పాటు క్రేజ్ కూడా జతకలిసేలా ఫ్యాన్సీగా కనిపించేలా.. ఒక్కసారి చూస్తే ఠక్కున గుర్తిండిపోయేలా వుండాలని కూడా కొందరు ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. ఇందుకోసం తమ కార్లకు వెచ్చించిన దానికంటే ఎక్కువ సొమ్మును కూడా వేలం పాటలో పాడేస్తుంటారు.
మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల పోటీలో ముందుగా నిలిచే 3456 నెంబరు.. ఆ తరువాత అత్యంత అధిక ధర పలికే వాటిలో రెండవది ‘‘9999’’ అనే ఫ్యాన్సీ నంబర్. ఈ నెంబర్ కోసం లక్షలు ఖర్చుపెట్టేందుకు సైతం పలువురు వెనుకాడరు. కానీ ఇంతటి అరుదైన నెంబర్ను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం కేవలం రూ.50 వేల ధరకే దక్కించుకోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయం ‘‘టీఎస్ 09 ఎఫ్డీ 9999’’ సిరీస్ను నెంబర్ను వేలానికి ఉంచింది. దీని రిజర్వ్ ధరను రూ.50 వేలుగా నిర్ణయించారు. ఇలాంటి అరుదైన నెంబర్ కోసం చాలామంది పోటీపడతారు. కానీ మేయర్ ఒక్కరే దీనికి దరఖాస్తు చేసుకున్నారని, పోటీకి ఇతరులెవరు రాకపోవడంతో రిజర్వ్ ధర రూ.50 వేలుకు బొంతుకే అప్పగించారు. అయితే ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది హైదరాబాద్ అయ్యింది. మేయర్ అనుచరులతో పాటు అధికారుల ఒత్తిడి కారణంగానే ఈ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని చర్చ జరుగుతోంది.
కాగా, గతంలో ఆర్టీఏ అధికారులు ఇదే నెంబర్ కోసం వేలం పాట నిర్వహించగా... రూ.7 లక్షల నుంచి రూ. 11 వరకూ ధర పలికింది. కేరళకు చెందిన ఓ సంపన్నుడు ‘‘9999’’ నెంబర్ కోసం రూ.31 లక్షలు వెచ్చించాడు. మరోవైపు తాజాగా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో ఒక్క రోజులో రూ.14.59 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more