Chigurupati Jayaram's wife Padma Sri on husband murder జయరామ్ ను ఇంత దారుణంగా చంపుతారనుకోలేదు: పద్మశ్రీ

Never thought my husband would be murdered chigurupati jayaram s wife padma sri

coastal bank partner jayaram, chigurupati jayaram, Jayaram's wife padma sri, jayaram murder case, jayaram suspisious death, coastal bank, niece shikha choudhary, DSP Bos, rakesh reddy, murder case, Nandigama police, crime

NRI Telugu industrialist Chigurupati Jayaram's wife Padma sri said, that her husband was feared of his own sister in 2016, but never assumed that they would murder him.

జయరామ్ ను ఇంత దారుణంగా చంపుతారనుకోలేదు: పద్మశ్రీ

Posted: 02/04/2019 03:20 PM IST
Never thought my husband would be murdered chigurupati jayaram s wife padma sri

కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో తానే దారుణానికి పాల్పడ్డానని కేసులోని ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న రాకేశ్ రెడ్డి అంగీకరించాడు. అయితే తాను అప్పుగా ఇచ్చిన రూ. 4.5 కోట్లను సకాలంతో తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతోనే తాను ఆయన వద్దకు వెళ్లానని చెప్పారు. ఈ విషయంలో జయరాంకు తనకు మధ్య కాస్తా వాగ్వాదం పెరిగిందని చెప్పాడు.

అయితే కోపంలో తాను అతనిపై చేయి చేసుకున్నానని.. హార్ట్ పేషంట్ కావడంతో ఆయన మరణించాడని రాకేష్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. శవాన్ని ఏం చేయాలో తెలియక సాయంత్రం వరకు ఇంట్లోనే వుంచామని చెప్పారు. సాయంత్రం కారులో శవాన్ని ఎక్కించుకుని నందిగామకు చేరుకున్నామని, అక్కడ కారుతో పాటు ఆయన శవాన్ని కూడా వుంచి వచ్చేశామని చెప్పారు. కాగా, తాను జయరాంను కావాలని చంపాలేదని, కోపంతో రెండు దెబ్బలు కొట్టేసరికి ఆయన తట్టుకోలేక చనిపోయాడని రాకేశ్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.

కాగా,  రాకేష్ రెడ్డి నేర చరిత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో మోసాలు, దందాలు సెటిల్మెంట్లకు పాల్పడిన రాకేష్ రెడ్డి , అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించడంలో దిట్ట. సినీనటిల చేత వ్యభిచారం చేయించినట్లు ఆరోపణలున్నాయి.ప్రముఖ హీరోయిన్ తో వ్యభిచారం చేస్తూ రాకేష్ రెడ్డి పట్టుపడ్డాడు.కొన్నాళ్ల క్రితం ఒక కేసులో రాకేష్ రెడ్డిని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు.కూకట్ పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు రూపాయలను రాకేష్ రెడ్డి వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా, జయరాం హత్యకేసు విషయం తెలుసుకుని వచ్చిన ఆయన భార్య పద్మశ్రీ తన అత్తారింటిపై పలు అరోపణలు చేసింది. జయరాంకు ఆయన బంధువుల నుండే ప్రమాదం వచ్చిందని అరోపించారు. 2016లోనే తన భర్త తన సొంత అక్కయ్య వారి నుంచి ప్రమాదముందని చెప్పారని అమె అరోపించారు. అయితే ఇండియాకు వస్తే ఇంత ఘోరంగా చంపుతారని తాను ఊహించలేదని అమె అన్నారు. మీటింగ్స్ వుండటం వల్లే జయరాం ఇండియాకు వచ్చారని అమె చెప్పారు. శిఖ ప్రమేయం అధికం కావడం వల్లే అమెను ఛానెల్ నుంచి తొలగించామని పద్మశ్రీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chigurupati jayaram  coastal bank  wife padma sri  shikha choudhary  rakesh reddy  murder case  crime  

Other Articles