ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాకింగ్ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన బీజేపి పార్టీ ఈవీఎం ట్యాపరింగ్ ద్వారానే అధికారంలోకి వచ్చిందని అమెరికాలో ఆశ్రయం పోందుతున్న సైబర్ నిపుణుడు, ఈవీఎం యంత్రాల తయారీ సాంకేతికతలో పాలుపంచుకున్న మాజీ ఈసీఐఎల్ ఉద్యోగిగా చెప్పుకున్న సయ్యద్ షుజా అరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెనురాజకీయ దుమారం రేగింది.
ప్రతిపక్షంలోని అనేక పార్టీలు సయ్యద్ షుజా అరోపణలపై నిజనిజాలను వెలికితీయాల్సిన అవసరం వుందని అంటూనే.. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఈవీఎంలకు బదులుగా పాతరోజుల్లో వినియోగించిన పేపర్ బ్యాలెట్లు విధానాన్నే వినియోగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సయ్యద్ షుజా చేసిన ఆరోపణలను ఖండించిన కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా.. రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈవీఎంలపై అరోపణలు రావడం సహేతుకరం కాదని అన్నారు.
తిరిగి పేపర్ బ్యాలెట్లకు వెళ్లే ప్రసక్తే లేదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సునిల్ అరోరా తాజా వివాదం గురించి స్పందిస్తూ.. ‘తిరిగి కాగితం బ్యాలెట్ల రోజులకు వెళ్లే ప్రసక్తే లేదు. మేం ఈవీఎంలనే కొనసాగిస్తాం. 2014 నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయి. కొందరు గెలిచారు. కొందరు ఓడిపోయారు. గెలిచిన వారికి ఈవీఎంలు మంచివే. ఓడిపోయిన వారు అవి సరిగా లేవని అంటారని పేర్కోన్నారు.
రాజకీయ పార్టీల చేతుల్లో ఈవీఎంలేం ఫుట్ బాల్ కాబోవని అన్నారు. దేశంలో రెండు దశబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. రాజకీయ పార్టీల డిమాండ్ల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీవీప్యాట్ యంత్రాలను కూడా తీసుకొచ్చామని సునిల్ అరోరా చెప్పుకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలనే కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు, వివాదాలను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more