ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులను అలకరించడం వల్ల ఆ రాష్ట్రానికి లాభం కూడా ఒనగూరుతుంది. అందుకనే ఉన్నత పదవుల్లో మనవారు అధిక సంఖ్యలో వుండాలని ఆయా రాష్ట్రాలవారు కోరుకోవడం కూడా సముచితమే. అదెలా అంటే.. సంక్రాంతి పండగను పురస్కరించుకుని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని ప్రజలు సొంతూళ్లకు ప్రయాణాలు సాగిస్తారు. ఇందుకోసం ముందుగానే ప్లానింగ్ చేసుకన్న ప్రయాణికులు తమ టికెట్లను రిజర్వు చేసుకుంటారు.
అయితే పండగ సెలవులు ఖచ్చితంగా తెలిసిన తరువాత రైలు టికెట్లను రిజర్వు చేసుకునేందుకు ప్రైవేటు పరిశ్రమల కార్మికులు పోటీ పడతారు. ముందుగా బుకింగ్ చేసుకున్నవారికి రైలు టికెట్లు లభించగా, అనేక మంది మాత్రం నిరుత్సాహంగా వెనుదిరిగి ఇతర రవాణా సాధనాలను అశ్రయించి.. జేబు గుల్లయినా తప్పదంటూ వెళ్తుంటారు. ఇక చివరి క్షణం వరకు వెళ్లాలా వద్దా.? అంటూ డైలిమాలో వున్నవాళ్లు కూడా వేల సంఖ్యలోనే వున్నారు. అయితే ఇలాంటి వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చోరవతో అదృష్టం కలసివచ్చింది. వెంకయ్యనాయుడు రైల్వేశాఖ అధికారులతో చోరవ తీసుకుని మాట్లాడిన నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వే శాఖ కానుక ఇచ్చింది.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జన్సాధారణ్ పేరుతో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 07912 నంబరుతో, విజయవాడ నుంచి హైదరాబాద్కు 07193 నంబర్ సర్వీస్తో ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన మేరకు ఈనెల 11 నుంచి 20 వరకు మొత్తం 18 సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. కాగా వెంకయ్యనాయుడు తన అత్త దశదిన కార్యక్రమం కోసం నెల్లూరులోని వెంకటాచలానికి బుధవారం వెళ్లారు. అక్కడి నుంచి రైలు మార్గంలో రేణిగుంటకు చేరుకున్నారు.
ఈ ప్రయాణంలో విజయవాడ డీఆర్ఎం ఆర్.ధనుంజయులు, పలువురు రైల్వే అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు నడపాలన్న తన సూచనపై స్పందించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. చొరవ తీసుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సంక్రాంతికి ఇంటికి వెళ్లేందుకు ఈ సర్వీసులు ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్టు రెండో వార్షికోత్సవాన్ని ఈనెల 13న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more