సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ వైపు అర్ఎస్ఎస్, మరో వైపు విశ్వహిందూ పరిషత్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన శివసేన మరో అడుగు ముందుకేసీ ప్రధానమంత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న తరుణంలో.. రామ భక్తులను శాంతింపజేసేందుకు కేంద్రం మరో బృహత్తరమైన ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.
ఇప్పటికే రామభక్తులు అయోధ్య విషయంలో కేంద్రంపై గుర్రుగా వున్న నేపథ్యంలో వారిని అకట్టుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. రామరావణ యుద్ధం సందర్భంగా శ్రీరాముని ఆజ్ఞ మేరకు వానర సైన్యం నిర్మించిందని భావిస్తున్న రామసేతు మన వైపు గట్టును సందర్శించే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత భూభాగంలో రామసేతు ప్రారంభమవుతున్న ధనుష్కోడి వరకు రైల్వేలైను నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు రామసేతు నిర్మితమై ఉందన్నది అనాదిగా వున్న నమ్మకం. దీంతో పంబన్ దీవిలోని రామేశ్వరం వరకు ప్రస్తుతం రైల్వే లైను ధనుష్కోడి వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించారు. రామేశ్వరం నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతానికి రైల్వేలైను అందుబాటులోకి వస్తే యాత్రికులు సులభంగా రామసేతును సందర్శించవచ్చు. దీంతో తమిళనాడులోని ధనుష్కోడికి మరోమారు పురాతన వైభవం రానుందని స్థానికులు సంబరపడుతున్నారు.
వాస్తవానికి గతంలో ధనుష్కోడి వరకు రైల్వేలైను ఉండేది. 1964లో వచ్చిన భీకర తుపాన్ సమయంలో ఈ లైను ధ్వంసమయింది. ధనుష్కోడి గ్రామం కూడా చరిత్రపుటల్లో కలిసిపోయింది. అంటే పాత రైల్వే మార్గాన్ని పునర్నిర్మిస్తున్నట్టే లెక్క. ఇక, మండపం నుంచి పంబన్ ద్వీపాన్ని కలుపుతూ ప్రస్తుతం ఉన్న రైల్వే వంతెనను ఆనుకుని కొత్త వంతెన నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న వంతెనకు సమాంతరంగా 249 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more