మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రి పగ్గాలను గడ్కారీకి ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న క్రమంలో తాజాగా ఆయన అమిత్ షాను టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో కాకపుట్టిస్తున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు సన్నధం అవుతున్న క్రమంలో బీజేపి అదినాయకత్వాన్ని ఇబ్బందిపెట్టేలా గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రియాశీలక నాయకత్వంలో చర్చలకు దారితీస్తున్నాయి.
తనకు ప్రధాన మంత్రి పదవిపై వ్యామోహం లేదని, కేంద్రమంత్రిగానే తాను సంతృప్తిగా వున్నానని ఇటీవల ప్రకటించిన గడ్కారీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో సెగపుట్టిస్తుంది, "నేను పార్టీ అధ్యక్షుడిని అయినప్పుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా?" అంటూ ఆయన ప్రశ్నించిన విధానం కూడా పార్టీ వర్గాల్లో కలవరాన్ని రేపుతోంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను ఉద్దేశించి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులు సరిగా పనిచేయకపోయినా, ఆశించిన ఫలితాలు దక్కకపోయినా నాయకులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. "ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. దేశంలో హోం శాఖ సమర్థంగా పనిచేస్తోందంటే, సుశిక్షితులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కారణం. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది సచ్చీలురని, చక్కగా పని చేస్తూ, తమ విధులను నిర్వర్తిస్తున్నారని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు.
‘‘అదే విధంగా నేను పార్టీ అధ్యక్షుడిని అయి, నా ఎమ్మెల్యేల పనితీరు, నా ఎంపీల పనితీరు సంతృప్తికరంగా లేదంటే అందుకు బాధ్యత నాదే. వారిని నేను సరిగ్గా నడిపించలేదనే భావించాలి" అని గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇండియాలో జరుగుతున్న మతపరమైన ద్వేషం పెరగడాన్ని కూడా గడ్కరీ ప్రస్తావించారు. తొలి ప్రధాని నెహ్రూ ప్రసంగాలంటే తనకు ఇష్టమని చెప్పారు. గత వారంలో మూడు రాష్ట్రాల ఓటమికి బీజేపీ జాతీయ నాయకులదే బాధ్యతని వ్యాఖ్యానించిన గడ్కరీ, తాజాగా మరోసారి నిరసన గళం వినిపించడంతో బీజేపీలో వాడివేడి చర్చ జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more