అగ్రరాజ్యం అమెరికాలోని ఓ మతానికి చెందిన ప్రార్థనా మందిరం తర్వలో హిందూ దేవాలయంగా మారనుంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని పోర్ట్స్ మౌత్ ప్రాంతంలోని 30 ఏళ్ల కిందట నిర్మితమైన క్రైస్తవ మతానికి చెందిన ప్రార్థనా మందిరం చర్చ్ను స్వామి నారాయణ ఆలయంగా మార్చనున్నారు. ఆలయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసిన అనంతరంలో ఇందులో విగ్రహ ప్రతిష్ఠ జరుగునుంది.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని స్వామి నారాయణ్ సంస్థాన్ అమెరికాలోని ఆలయాలుగా మార్చిన చర్చులలో ఇది ఆరోది, ప్రపంచంలో తొమ్మిదోది. గతంలో కాలిఫోర్నియా, ల్యూస్వెల్లీ, పెన్సుల్వేనియా, లాస్ ఏంజెల్స్, ఓహియాలోని చర్చ్లు ఆలయాలుగా మారాయి. అలాగే బ్రిటన్లోని లండన్, మాంచెస్టర్ సమీపంలోని బోల్టన్ చర్చ్, 125 ఏళ్ల కిందట నిర్మించిన కెనడాలోని టొరొంటో చర్చ్ను స్వామి నారాయణ్ ఆలయంగా మార్పు చెందాయి.
దీని గురించి స్వామి నారాయణ్ సంస్థాన్ మహంత్ భగవత్ప్రియాదాస్ స్వామి మాట్లాడుతూ.. తమ ఆధ్యాత్మిక గురువు పురుషోత్తమ్ప్రియాదాస్ స్వామి సూచనల మేరకు 30 ఏళ్ల కిందట నిర్మితమైన వర్జీనియాలోని పోర్ట్స్మౌత్ చర్చ్ను కొనుగోలుచేసి ఆలయంగా మార్చనున్నామని తెలిపారు. ఇది వరకే ఇతర మతానికి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి, దీనికి పెద్ద మార్పులు అవసరం లేదని అన్నారు. వర్జీనియాలో వైష్ణవ భక్తులకు ఇది తొలి ఆలయంగా మారుతుందని భగవత్ ప్రియదాస్ వ్యాఖ్యానించారు.
వర్జీనియాలో 10 వేల మంది గుజరాతీలు ఉన్నట్టు స్వామి నారాయణ్ ఆలయ వర్గాల పేర్కొన్నాయి. వీరిలో అత్యధికం ఉత్తర, మధ్య గుజరాత్, కచ్ ప్రాంతాలకు చెందినవారే. ఐదు ఎకరాల స్థలంలో 18,000 చదరపు అడుగల విస్తీర్ణంలో ఈ చర్చ్ నిర్మితమైంది. దాదాపు 150 వరకు ద్విచక్రవాహనాలు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ ప్రదేశం ఉంది. చర్చ్ మొత్తం విలువ 1.6 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more