ఫ్యాక్షనిస్టు నేతగా, కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా చెలామణి అయిన గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్యకేసులో అతని ప్రధాన అనుచరుడు భానుకిరణ్ ను నాంపల్లి కోర్టు తేల్చింది. నమ్మకంగా మెలుగుతూనే పథకం ప్రకారం భానుకిరణ్, మద్దెలచెరువు సూరిని హత్యమార్చినట్టు నమ్మిన న్యాయస్థానం అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తు తీర్పును వెలువరించింది. దీంతో పాటు 20 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ కు సహకరించిన భాను అనుచరుడు మన్మోహన్ సింగ్ ను కూడా దోషిగా పరిగణించిన న్యాయస్థానం అతనికి ఐదేళ్ల కారాగారవాసంతో పాటు ఐదు వేల జరిమానా విధించింది. అయితే ఈ కేసులో ప్రమేయముందని అరెస్టైన ఆరుగురిలో కేవలం ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. మిగతా నలుగురు సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులగా విడుదల చేసింది.
హైదరాబాద్ లోని యూసప్ గూడ ప్రాంతంలో 2011, జనవరి 4న సూరి కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అనంతరం భానుకిరణ్ పారిపోవడంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత పోలీసులు భానుకిరణ్ పై మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు దర్యాప్తు అధికారులు. ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఇవాళ న్యాయస్థానం వెలువరించింది.
హత్య జరిగిన వెంటనే సూరి డ్రైవర్ మధుమోహన్ పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసును సవాల్ గా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఇవాళ భానుకిరణ్; మన్మోహన్ సింగ్ లను దోషులుగా తేల్చింది. సూరి డ్రైవర్ వాంగ్మూలం, భానుకిరణ్ వాడిన తుపాకీ, కాల్ డేటా ఆధారంగా కోర్టు భానును దోషిగా తేల్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more