రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారో తెలిపే బ్యాలెట్ బాక్పు రోడ్డుపై లభించింది. ఓటర్లు తమ తీర్పును నమోదు చేసిన తరువాత తిరిగి స్థానిక కేంద్రంలో తమ బ్యాలెట్ బాక్సును అప్పగించే క్రమంలో తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాలెట్ బాక్సుల తరలింపు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి రావడంతో తక్షణ చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. ఇద్దరు పోలింగ్ అధికారులను సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లో పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ బ్యాలెట్ బాక్స్ రోడ్డు మీద పడిపోయింది. బారన్ జిల్లాలోని కిషన్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని షాహబాద్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ తర్వాత వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తరలిస్తుండగా బ్యాలెట్ బాక్స్ కిందపడిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎన్నికల విధులు నిర్వహించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు.
#WATCH: A ballot unit was found lying on road in Shahabad area of Kishanganj Assembly Constituency in Baran district of Rajasthan yesterday. Two officials have been suspended on grounds of negligence. #RajasthanElections pic.twitter.com/yq7F1mbCFV
— ANI (@ANI) December 8, 2018
తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్ ను వారు కిషన్గంజ్లో మిగతా ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్ రఫీక్, నవల్ సింగ్ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, మరో ఘటనలో రిటర్నింగ్ అధికారిని అధికారులు తొలగించారు. రాజస్థాన్ లోని పాలి నియోజకవర్గంలో ఓ బీజేపి అభ్యర్థి నివాసంలో ఓ ఈవీఎం యంత్రం పట్టబడటంతో అధికారులు రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more