పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. జస్టిస్ రోహింగ్టన్ నారీమన్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం విచారణ తరువాత స్పష్టం చేసింది.
విభజన తర్వాత తెలంగాణలో బీసీల జనాభా గణనీయంగా పెరిగిందని, రిజర్వేషన్లు 50 శాతం కన్నా ఎక్కువ పెంచుకొనే అవకాశం ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 7 శాతం కలిపి మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కోర్టుకు వివరించారు. ఈ వివరణపై స్పందించిన ధర్మాసనం.. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ ఉండొచ్చు కానీ గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.
ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీం తీర్పు అనంతరం రిజర్వేషన్లు 50 శాతమే కొనసాగుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కాబట్టి మళ్లీ అక్కడకే వెళ్తామని, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీంతో పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
వీటిపై గత జులై 9న విచారణ చేపట్టిన హైదరాబాద్ హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. బీసీ జనాభాను లెక్కించినా, లెక్కించకపోయినా రిజర్వేషన్ల ఖరారు అంశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం మించకూడదని, బీసీల్లో ఏ, బీ, సీ,డీలుగా రిజర్వేషన్లు కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని పేర్కొంది. అలాగే, 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేనని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more