తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్ను జారీ చేశారు. షెడ్యూల్డు ప్రకారం మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు గానూ ఒకే విడతలో డిసెంబరు 7న పోలింగ్ నిర్వహించనున్నారు. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయి రోజు నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల స్వీకరణకు 19 వరకు గడువు ఉంది.
నవంబరు 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంది. డిసెంబర్ 7న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. అయితే, నామినేషన్ల దాఖలుకు మాత్రం అభ్యర్థులు తమ సెంటిమెంట్లకు పనిచెబుతున్నారు. మంచి రోజు, శుభముహూర్తం, శుభతిధులను ఎంచుకుని ఫాలో అవుతున్నారు. పలువురు అభ్యర్థులకు ఈ సెంటిమెంట్లు లేకపోయినా.. వారి ప్రధాన అనుచరులు సెంటిమెంట్లను ఫాలో కావాలని సూచించి మరీ ఫాలో అయ్యేలా చేస్తున్నారు.
ఈ క్రమంలో నామినేషన్ నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో ఈ ప్రక్రియ ఇవాళ ఉదయం 11 గంటలకే ఆరంభం అయ్యింది. అయితే ఈ రోజు అంత మంచిది కాదు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యే శుభ ఘడియలు ఉండటంతో అన్ని పార్టీల నేతలు ఈ రోజు నామినేషన్లను దాఖలు చేయలేని పరిస్థితి. అలాగే సోమవారం సాయంత్రం నుంచి మంగళవార వరకు కొనసాగుతున వర్జ్యం అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా చేస్తుంది. కాబట్టి రేపు కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదు.
ఇక నవంబరు 15న అష్టమి కాబట్టి అంత మంచి తిథి కాదు. నవంబరు 16, 17 తేదిల్లో నవమి తిథి ఉన్నా సంఖ్యా పరంగా అంతగా కలిసిరాదని భావిస్తారు. అందుకే ఈ తేదీల్లోనూ నామినేషన్లు దాఖలు చేయడానికి నేతలు వెనుకంజవేస్తారు. నవంబరు 18 దశమి తిథి అయినా, ఆదివారం కావడం వల్ల నామినేషన్లు స్వీకరించరు. ఇక మిగిలింది కేవలం రెండు రోజులే.. అవి నవంబరు 14, 19 మాత్రమే. ఈ రెండు రోజుల్లో సప్తమి, ఏకాదశి తిథులు ఉండటమే కారణం.
కాబట్టి, నవంబరు 14,19 తేదీల్లోనే నామినేషన్లు దాఖలు చేస్తే విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ముహూర్తాలు చూసుకుని ముందడుగు వేసే మన రాజకీయ నాయకులు, నామినేషన్ల సమయంలోనూ వాటిని పాటిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నామినేషన్ దాఖలకు ఏడు రోజులు గడువున్నా తిథి, శుభఘడియలు, వర్జ్యం, దుర్ముహూర్తంలు లాంటివి పరిగణనలోకి తీసుకుంటే ఆ రెండు రోజులు మాత్రమే మంచివని జ్యోతిషులు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more