పరమ పవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద రాజకీయ పార్టీలు, పరోక్ష రాజకీయాలకు నేతృత్వం వహించే సంస్థలు రాజకీయాలు చేయడంపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలకు నెలవైన పవిత్ర ప్రాంతానికి రాజకీయాలు అంటగట్టి ‘‘అపవిత్రం’’ చేయవద్దంటూ అధికార, విపక్ష పార్టీలకు హితవు పలికారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను రాజకీయ లబ్దికి వినియోగించుకోవడం హేయకరమైన చర్యగా పేర్కోన్నారు.
ఈ క్రమంలో అటు ఆర్ఎస్ఎస్, బీజేపీలతో పాటు ఇటు కేరళ ప్రభుత్వాన్ని సైతం తనదైన శైలిలో నిలదీశారు. ‘‘సంప్రదాయక ఆధునికతకు, మారుతున్న ప్రపంచంలోని మన సమాజానికి మధ్య... లోతైన ప్రశ్నలను లేవనెత్తుతున్న ఈ అంశాన్ని తక్కువగా తీసిపారేయడం తగదు. బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎలాంటి హింసకు దారితీశాయో చూశాం. శబరిమలలోని ప్రజలను భయపట్టే విధంగా వ్యవహరించడం దారుణం. పవిత్ర క్షేత్రమైన ఈ ప్రదేశాన్ని రాజకీయాలకు వేదికగా మారుస్తూ... తన పార్టీకి సువర్ణ అవకాశం దొరికినట్టు బీజేపీ చీఫ్ భావించడం సిగ్గుచేటు..’’ అని శశిథరూర్ మండిపడ్డారు.
శబరిమల పవిత్రతను కాపాడాలని ఓ వైపు ఉద్యమిస్తున్న ఆర్ఎస్ఎస్ నేతలు ఆలయ పవిత్రను దెబ్బతీసే విధంగా పద్దెనిమిది బంగారు మెట్లను ఇరుముడి లేకుండా ఎక్కడం ఏంటని ప్రశ్నించారు. ఈ మెట్లను ఎక్కడానికి మాత్రమే వినియోగిస్తారని, అయితే ఆర్ఎస్ఎస్ నేత కిందకు దిగడంతో మరోమారు అపవిత్రమయ్యాయని పేర్కోన్న ఆయన దీనికి మీరేం బదులిస్తారని నిలదీశారు. భక్తుల భక్తి విశ్వాసాలకు విరుద్దంగా నడుచుకుంటూన్నారని శశిధరూర్ వ్యాఖ్యానించారు.
శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు కేరళ ప్రభుత్వ వైఖరి కూడా ఆజ్యం పోసిందన్నారు. భాగస్వామ్య పక్షాలన్నిటితోనూ చర్చలు జరిపి అందరికీ ఆమోయోగ్యమైన రీతిలో ప్రభుత్వం ముందుకెళ్లాల్సిందనీ... అలాంటిదేమీ లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసేందుకు హడావిడిగా ముందుకెళ్లడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు. భక్తుల మనోభావాలు గౌరవిస్తూనే, మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more