MIM warns TRS in rajendranagar assembly seat టీఆర్ఎస్ కు ఎంఐఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Mim asuddudin owasi warns trs in rajendranagar assembly seat

KCR, K.ChandraShekar Rao, CM, Rajendra Nagar Seat, Prakash Goud, Car, kite, MIM, Asaduddin Owaisi, Telangana, politics

MIM chief Asaduddin warns TRS party chief and Telangana care taker CM KCR in lieu of Rajendra nagar seat says to forget the said seat if car wants to win in Telangana.

టీఆర్ఎస్ కు ఎంఐఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Posted: 11/09/2018 12:00 PM IST
Mim asuddudin owasi warns trs in rajendranagar assembly seat

మరో నెల రోజుల లోపు వ్యవధిలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు తన జోరును కొనసాగించాలంటే ఆ ఒక్కస్థానాన్ని మాత్రం మర్చిపోవాలని.. లేదంటే కారు జోరుకు తాము బ్రేకులు వేస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అధికార టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఆ ఒక్క సీటు తప్ప ఇంకెక్కడైనా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసుకోవచ్చని అసదుద్దీన్ ఒవైసీ అధికార టీఆర్ఎస్ కు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఆ ఒక్క సీటే రాజేంద్రనగర్.

తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చనీ, కానీ రాజేంద్ర నగర్ లో మాత్రం అడుగుపెట్టొద్దని పరోక్షంగా హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా ప్రజలను పట్టించుకోని కొందరు నేతలు ఎన్నికల నేపథ్యంలో కారులో దూసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కారు’ ప్రయాణాన్ని సుఖవంతం చేయాలనుకుంటే రాజేంద్రనగర్ ను తమకు ఇవ్వక తప్పదని స్పష్టం చేశారు. ఇక్కడ ‘కారు’ నడవబోదనీ, దాని స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో చంద్రబాబు కూటములు ప్రభావం అంతగా పనిచేయబోవని జోస్యం చెబుతూ అధికార పార్టీకి వంతపాడిన ఆయన.. ఎంఐఎం ను హైదరాబాద్ నుంచి తరిమివేస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ ముక్త తెలంగాణ త్వరలోనే సాకారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో ఎంఐఎం కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎంఐఎం పార్టీతో తమకు మైత్రి కోనసాగుతుందని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ.. వారితో పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ మాత్రం కోనసాగుతుందని చెప్పారు.

కాగా, స్నేహపూర్వక పోటీ నేపథ్యంలో ఈ రెండు మిత్రపక్ష పార్టీల మధ్య తాజాగా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్తానం మాత్రం అగ్గి రాజేస్తుంది. ఈ సీటుపై అశలు వదులుకుంటేనే టీఆర్ఎస్ పార్టీకి మంచి జరుగుతుందని, లేదంటే తమ పార్టీ రానున్న ఎన్నికలలో అధికార పార్టీ జోరును అడ్డుకుంటామని కూడా తేల్చిచెబుతుంది. మరీ ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.? ఎంఐఎంతో ఎలాంటి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  K.ChandraShekar Rao  CM  Rajendra Nagar Seat  Prakash Goud  Car  kite  MIM  Asaduddin Owaisi  Telangana  politics  

Other Articles