అమెరికాలో గన్ కల్చర్ అక్కడి నేరాల సంఖ్యను అంతకంతకూ పెంచుతోంది. అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత కలకలం సృష్టించింది. కాలిఫోర్నియా పరిధిలోని లాస్ ఏంజిలెస్ నగరంలోని థౌజండ్ ఓక్స్ ప్రాంతంలోగల బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ లో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్తానిక యూనివర్శిటీ విద్యార్థులతో కిక్కిరిసిపోయిన బార్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ లోకి చొరబడిన ఓ సాయుధ అగంతకుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో కాల్పుల్లు జరిపిన వ్యక్తితో పాటుగా 12మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో వున్న బారులోని కస్టమర్లు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు. స్థానికంగా వున్న ఓ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటుండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే క్షతగాత్రుల్లోని పలువురి పరిస్థితి కూడా విషమంగానే వుందని పోలీసులు వెల్లడించారు.
బార్ లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు వెన్ తురా కౌంటీ షెరిఫ్ ఆఫీస్ డిప్యూటీ రాన్ హెలియస్ కూడా బార్ లోనే ఉన్నారని ఆయన కూడా అగంతకుడు జరిపిన గాయాల్లో తీవ్ర గాయాలపాలై.. అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో బార్ లో వంద మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. అగంతకుడు ముందుగా పొగ వచ్చే గ్రెనేడ్లను బార్ లోకి విసిరేసి ఆ తర్వాత కాల్పులు జరపడం ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పుకొచ్చారు.
గన్ తో చొరబడిన అగంతకుడు కూడా బార్ లో చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతడ్ని ఎవరు కాల్చారన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఓ వ్యక్తి రాత్రి 11.30 గంటల సమయంలో బార్ లోకి చొరబడి నలుపు రంగు తుపాకీతో కాల్చడం ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. ‘దాదాపు 30 రౌండ్లు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఇప్పటికీ గన్ షాట్స్ వినిపిస్తూనే ఉన్నాయి’ అని సదరు వ్యక్తి చెప్పాడు.
ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు 12 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే అగంతకుడు ఎవరు.? అదే యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థా.? లేక ఎవరూ అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. గత నెల పిట్స్ బర్గ్ లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ ఆంగతకుడు చొరబడి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలకు తెగించిన నలుగురు పోలీసులు ఎట్టకేలకు నిందితుడ్ని పట్టుకున్నారు. అగంతకుడు, నలుగురు పోలీసులతో పాటు మరో వ్యక్తి కూడా ఈ కాల్పుల ఘటనలో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more