ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చెందిన ఓ అధికారిని లొంగదీసుకుని ఏకంగా కోటి రూపాయలు లంచం ఇచ్చారన్న అభియోగాలపై మైనింగ్ కింగ్, బళ్లారి బీజేపీ నేత మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కేంద్ర నేర విభాగానికి చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. అయితే తనను అరెస్టు చేసేందుకు సీసీబి బలగాలు వస్తున్నాయన్న సమాచారం అందుకున్న గాలి జనార్థన్ రెడ్డి అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో గాలి జనార్థన్ రెడ్డి కోసం అన్వేషణకు పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రస్తుతానికి ఆయన జాడ తెలియనప్పటికీ, సాధ్యమైనంత త్వరలో గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఓ సంస్థను ఈడీ విచారణ నుంచి బయట పడేసేందుకు ఈడీ అధికారినే బుట్టలో వేసుకున్న గాలి జనార్ధన్ రెడ్డి, కోటి రూపాయలను లంచం ఇచ్చినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఆయన నివాసాలు, కార్యాలయాలపై దాడులకు దిగారు. దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఇక ఈ కేసులో మరికొందరు పోలీసులు గాలి జనార్ధన్ రెడ్డిని ఇంటిని తనిఖీ చేయడంతో వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. దీంతో వారు దిగ్భ్రాంతి గురయ్యారు. గాలి జనార్థన్ రెడ్డి ఆచూకీ కోసం సీసీబీ పోలీసులు, ఇంట్లో తనిఖీలకు వెళ్లిన సమయంలో, ఇంటి గోడల మధ్య రహస్య లాకర్లు కనిపించాయని వెల్లడించారు. గోడల మధ్య ఉన్న లాకర్లలో ఏం దాచారన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో గాలి వ్యక్తిగత సహాయకుడిగా వున్న అలీఖాన్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు పేలుడు పదార్థాలు లభించాయి. ఈ విషయాన్ని వెల్లడించిన పోలీసులు, గాలి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more