రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను దేశ అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమర్థుడంటూ అఘమేఘాల మీద తీసుకువచ్చిన కేంద్రం తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై ముప్పేటదాడికి దిగుతున్న క్రమంలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి.. అటు అర్బీఐకి మధ్య అంతరం మరింత పెరుగుతుంది. బ్యాంకు రుణాలు ఎగ్గోట్టిన వారి వివరాలను ఎందుకు బయటపెట్టాల్సి వచ్చిందో తెలియజేయాలని కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేయడమే ఇందుకు కారణంగా నిలుస్తుంది.
బ్యాంకుల నుంచి రూ. 50 కోట్లకు మించి రుణాలను తీసుకుని, ఉద్దేశ పూర్వకంగా వాటిని ఎగ్గొట్టిన వారి వివరాలను బహిర్గతం చేయాలని దేశసర్వోన్నత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆర్బీఐ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తాను సుప్రీం ఆదేశాల ప్రకారం నడుచుకుంటే కేంద్రం ఇప్పుడు తమను నిందిస్తుండటం ఏంటని అర్బీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు మెండి బకాయిలపై అర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ రాసిన లేఖను కూడా బయటపెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం, అర్థిక మంత్రిత్వశాఖలు అర్బీఐని డిమాండ్ చేయడంతో ఉర్జిత్ పటేల్ కేంద్రం నుంచి ముప్పేటదాడిని ఎదుర్కోంటున్నారు. ఇప్పటికే కేంద్రం పెత్తనం నేపథ్యంలో రాజీనామా చేయాలని యోచనలోకి వచ్చిన అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. కేంద్రం అర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిగిన చర్చల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, బ్యాంకుల నుంచి రూ.50 కోట్లు ఆ పైన రుణాలను పొందిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను ఎందుకు బహిర్గతం చేయలేదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రూ. 50 కోట్లు అంతకుమించి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి పేర్లను వెల్లడించాల్సిందేనని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించడాన్ని తప్పుబట్టింది.
రుణాలు ఎగవేతదారుల పేర్లు ఎందుకు వెల్లడించలేదో ఈ నెల 16లోగా సమాధానం చెప్పాలంటూ సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఆర్బీఐ గవర్నర్నే ప్రధాన సమాచార అధికారిగా భావించాల్సి ఉంటుందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పేర్లను వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు గాను జరిమానా ఎందుకు విధించకూడదో 16లోగా చెప్పాలని ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more