ప్రముఖ నిర్మాత.. భళ్లాలదేవుడిగా యావత్ భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు దగ్గుబాటి రాణా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబుపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రితం రోజు రాత్రి ఆయన తన కారును రాంగ్ రూట్లో నడిపించడంతో పాటు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నారు. దీంతో ఆ వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వేగంగా వస్తూ అదుపుతప్పి కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన సతీష్ చంద్ర, ఆయన భార్య నీలం దుర్గాదేవిలు తమ మూడేళ్ల చిన్నారి సిద్దేశ్ చంద్రతో కలసి లాలాగూడలో నివసించే తమ బంధువుల ఇంటికి తమ ద్విచక్రవాహనం హోండా యాక్టీవాపై వెళ్తున్నారు. బోయిన్ పల్లి దాటి తాడ్ బంద్ మీదుగా లాలాగూడుకు చేరుకునే క్రమంలో సరిగ్గా సికింద్రాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్ వద్ద ఓ కారు రాంగ్ రూట్ లో వేగంగా దూసుకువచ్చింది.
ఈ క్రమంలో కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొనింది. దీంతో ఆ వాహనంపై ప్రయాణిస్తున్న చిన్నారి సిద్దేశ్ చంద్ర తో పాటు నీలం దుర్గాదేవి, సతీష్ చంద్రలు గాయలపాలయ్యారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులైన వారిని 108 వాహనానికి ఫోన్ చేసి అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. కాగా, ప్రమాదానికి గురైన వాహనం ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుదని, ఆయనే వాహనాన్ని నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.
ఘటన తరువాత దగ్గుబాటి సురేష్ బాబు.. మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. ప్రమాదానికి కారణమైన సురేష్ బాబుకు 41ఏ నోటీసులు ఇచ్చిన కార్ఖానా పోలీసులు.. ఐపీసీ 337 కింద కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన సురేష్ బాబు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారని సమాచారం. ప్రమాదానికి కారణమైన కారును కూడా ఆయన పోలిస్ స్టేషన్ కు తీసుకువచ్చి అప్పగించారని పోలీసులు తెలిపారు. కాగా సురేష్ బాబును వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టామని తెలిపారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more