రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ అంతకంతకూ తమ ఉనికిని చాటుకుంటూ బలోపేతం అవుతుంది. ఇన్నాళ్లు బలమైన నాయకగణం లేదన్న విమర్శలపై మిన్నకుండిన పార్టీ అధినేత జనసేనాని పవన్ కల్యాణ్.. తన పార్టీలో చేరుతున్న నాయకుల జాబితాతోనే విమర్శకులకు సమాధానం ఇస్తున్నారు. ఓ వైపు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటూ మరోవైపు మంచి నాయకులను సమీకరించుకుంటూ జనసేన ముందుకుసాగుతుందని ఆ పార్టీ వర్గాలు చెప్పిన మాటలు వాస్తవరూపం దాల్చుతున్నాయి.
ఇప్పటికే వామపక్ష పార్టీలతో కలసి ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేనకు అటు యువత నుంచి కూడా పెరుగుతున్న ఆదరణతో ఎన్నికల సమయానికి మరింత పటిష్టంగా తయారై అధికార, విపక్ష పార్టీలకు దిమ్మదిరిగేలా బదులిస్తుందని కూడా జనసేన వర్గాలు, పవన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు వ్యాపారం కాదని, ప్రజలకు సేవ చేసే మహాభాగ్యమని.. ఆ అవకాశాన్ని ప్రస్తుతం అధికార, విపక్ష పార్టీలు స్వార్థానికి వినియోగ పర్చుకుంటున్నాయని తమ అధినేత అవేదన చెందుతున్నారని కూడా ఆయా వర్గాలు పేర్కోంటున్నాయి. ఫలితంగా ప్రజలకు మేలు జరగడం లేదని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక్ష పోరులోకి తొలిసారి బరిలోకి దిగుతున్న జనసేనకు నాయకులు ఒక్కొక్కరి నుంచి మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత పంతం నానాజీ రెండు నెలల క్రితమే జనసేనలో చేరారు. కాగా తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ శాసససభ సభాపతి నాదేండ్ల మనోహర్ కూడా జనసేనలో చేరనున్నారు. ఇవాళ తిరుపతిలో ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ ఆద్వర్యంలో ఆయన పార్టీ తీర్దం పుచ్చుకోనున్నారు.
జనసేన పార్టీలో చేరికపై ఇప్పటికే నాలుగు నెలల క్రితం జూన్ 23న పవన్ కల్యాణ్ ను కలసిన నాదేండ్ల ఆయన వద్ద నుంచి అనుమతిని తీసుకున్నారని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని నెలల వరకు చేరికలపై పవన్ కల్యాణ్ ఎవరికీ స్పష్టత ఇవ్వలేదని, దీంతో ఇవాళ ఆయన జనసేనలో చేరుతున్నారని సమాచారం. ఇక జనసేన పార్టీలో చేరిక సందర్భంగా ఆయన తన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తిరుపతికి బయలుదేరారు. నాదేండ్ల మనోహర్ ను పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more