ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మరోమారు కేంద్రం షాక్ ఇచ్చింది. అప్ పార్టీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అడపాదడపా కేంద్రం నుంచి లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి మొదలు అన్ని రకాలుగా షాకులు తిన్న ప్రభుత్వానికి తాజాగా కొంతకాలం తరువాత అప్ మంత్రిపై ఆదాయ పన్ను దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా అప్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు మంత్రులు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ తరహా దాడులను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ నిర్వహించింది.
ఇక తాజాగా ఢిల్లీ రాష్ట్ర రెవెన్యూ, రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పన్నుల ఎగవేత ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తన్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో గల మంత్రి నివాసంతో పాటు దేశ రాజధాని చుట్టుపక్కల దాదాపు 16 ప్రాంతాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంత్రికి చెందిన బ్రిస్ఖ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్, కార్పోరేట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలపై కూడా దాడులు జరిగాయి.
వసంత్ కుంజ్ లోని మంత్రి నివాసం, ఢిఫెన్స్ కాలనీ, ఆయనకు చెందిన పశ్చిమ్ విహార్, నజాఫ్ గర్, లక్ష్మీ నగర్, పాలమ్ విహార్, గుర్ గ్రామ్ లోని పలు ప్రాంతాలలో అదాయశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారు జామునుంచే అధికారులు దాడులను నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు సంబంధికులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, తన మంత్రివర్గంలోని కీలక సభ్యుడైన కైలాష్ గెల్హాట్ నివాసం, కార్యాలయాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఢిల్లీలో తాము బీజేపి అంచనాలను తారుమారు చేసి ప్రభుత్వాన్ని చేపట్టిన నాటి నుంచి కేంద్రంలోని ప్రభుత్వం తమను రాజకీయంగా ఎదుర్కోలేక తమ ప్రభుత్వంపై ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తుందో.. స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖలను తమపైకి ఎలా ఉసిగోల్పుతుందో తాము అన్ని గమనిస్తున్నామని.. ప్రజల నుంచి చిత్కారాలను ఎదుర్కోన్న బీజేపి మాత్రం ఇంకా తమ పద్దతిని మార్చుకోవడం లేదని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more