ఎన్నికల కమిషన్ దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయా రాష్ట్రాల్లో విజయం ఎవరిని వరిస్తుంది.. అక్కడి పరిస్థితులు ఎలా వున్నాయన్న అంశాలపై అధ్యయనం చేసిన సర్వే సంస్థ.. ఈ సారి బీజేపి అత్యంత పట్టున్న ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లు హస్తగతం అవుతాయని అంచనాలు వేశాయి. ఇక అటు రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారంలోకి రానుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు సర్వే సంస్థ ఏబిపి న్యూస్, సీ-ఓటర్ సంస్థలు సంయుక్తంగా సర్వేను నిర్వహించి వివరాలను వెల్లడించాయి.
రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించి.. ఎన్నికల నిర్వహణకు తాము సిద్దమని కూడా ప్రకటించింది. అయితే మూడు రాష్ట్రాల్లో మాత్రం ప్రధాని నరేంద్రమోడీ, జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా నేతృత్వం వహిస్తున్న కాషాయ పార్టీకి మాత్రం పరాభవం తప్పదని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ దాదాపుగా దశాబ్ధమున్నర కాలం పాటు అధికారంలో వున్న బీజేపీకి ఈ సారి ప్రజలు తిరస్కరించనున్నారని సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తమ జెండాను ఎగరవేయనుందని తెలుస్తుంది. ఇక రాజస్థాన్ లో కూడా అధికార బీజేపి పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి వసుందర రాజే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని.. దీంతో ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకోనుందని అంచనా వేసింది.
ఏబీపీ న్యూస్-సీవోటర్ సర్వే ప్రకారం.. రాజస్థాన్ మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోనుంది. రాజస్థాన్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 200 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 142, బీజేపీకి 56 సీట్లు దక్కుతాయని సర్వే ద్వారా వెల్లడైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్కి 122 సీట్లు దక్కుతాయని, బీజేపీకి 108 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కి 47, బీజేపీకి 40 సీట్లు వస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more