పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే తొంబై రూపాయలు దాటిన పెట్రోల్.. ఇక వందను అందుకునేందుకు పోటీపడుతున్నా.. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. విపక్షంలో వున్నప్పుడు ధరలు పెరుగుతున్నాయని గగ్గోలు పెట్టిన పార్టీయేనా.. ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నది అని దేశప్రజలు, మరీ ముఖ్యంగా వాహనదారులు నివ్వెరపోయేలా చేస్తుంది. అప్పుట్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పెద్దలే.. గద్దెనెక్కిన తరువాత ఇలా రంగుమారుస్తారా.? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ధరలు తగ్గినప్పుడు తమ ఘనతగా చెప్పుకున్న ప్రభుత్వం నాలుగేళ్లుగా పెంచిన ఎక్సైజ్ పన్నును కూడా తగ్గించకుండా.. మరింత భారం మోస్తున్న వాహనదారులపై చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇవాళ కూడా తాజాగా ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటికే రూ. 90ని దాటిన లీటర్ పెట్రోలు ధర, సెంచరీ దిశగా శరవేగంగా సాగుతోంది. నేడు పెట్రోలుపై 14 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ అర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 90.22కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో రూ. 82.86కు, కోల్ కతాలో రూ. 86.48కు, చెన్నైలో రూ. 86.13కు, హైదరాబాద్ లో రూ. 87.84కు పెట్రోలు ధర పెరిగింది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ పై 10 పైసల ధర పెరుగగా, ఢిల్లీలో రూ. 74.12కు, ముంబైలో రూ. 78.69కు, కోల్ కతాలో రూ. 75.97కు, చెన్నైలో రూ. 78.36కు హైదరాబాద్ లో రూ. 80.62కు ధర పెరిగింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతూ ఉండగా, డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో 'పెట్రో' ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more