నగరవాసుల ఎన్నో రోజులు నిరీక్షణను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎట్టకేలకు స్వస్తిపలికేలా చేయనుంది. గత ఏడాది చివరాంకంలో ప్రారంభమైన అమీర్ పేట్ - నాగోల్, మియాపూర్ - అమీర్ పేట్ మెట్రో రైలు మార్గం తరువాత మరో అరు మాసాల్లో ప్రారంభమవుతుందని ప్రకటించినా.. అనేక వాయిదాలతో స్వాతంత్ర్య దినోత్సవానికి.. ఆ తరువాత సెప్టెంబర్ 5కు ఇలా వాయిదాలు వేసుకన్న అమీర్ పేట్ - ఎల్బీనగర్ మార్గం విషయంలో ఎట్టకేలకు మెట్రో రైల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ నెల 24న అమీర్ పేట్-ఎల్బీ నగర్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో కలసి వెళ్లిన మెట్రో రైలు అధికారులు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి ఈ విషయాన్ని చర్చించారు. మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించాలని కేటీఆర్ గవర్నర్ ను కోరడంతో ఆయన అందుకు తన సమ్మతిని తెలిపారు. ఈ నెల 24న మధ్యాహ్నం 12:15 నిమిషాలకు ఎల్బీనగర్- మియాపూర్ మెట్రో రైలు ప్రారంభం కానుందని అధికారులు గవర్నర్ నరసింహన్ తో తెలిపారు. కాగా ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
గవర్నర్ ని కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు.. సీఎస్ ఎస్కే జోషీ , మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసిన మెట్రో రైలు అధికారులు ఎల్బీ నగర్ నుంచి అమీర్ పేటకు ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రూట్ లో మెట్రో రావడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించనుందని హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది.
Happy to announce that Hon’ble Governor Sri ESL Narasimhan Garu has consented to flag off the Ameerpet - LB Nagar metro line on 24th Sep at 12:15pm#HyderabadMetro pic.twitter.com/TsbA1tQGHE
— KTR (@KTRTRS) September 19, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more