కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ అన్ని రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటూ తమిళనాడులో మాత్రం ప్రజలకు దేరువ కావాల్సిన పార్టీ.. వివాదాల మధ్య చిక్కుకుని.. చులకన అవుతుంది. అదేంటి అంటే పార్టీ అధ్యక్షురాలి సమక్షంలోనే ఈ వివాదాలు జరగుతుండటంతో వాటిని చక్కబెట్టుకునేందుకునే పార్టీ నేతలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఇటీవల తమిళనాడు బీజేపి అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్ విమానాశ్రయంలో వెళ్తుండగా అమెను చూసిన ఓ ప్రయాణికురాలు బీజేపి పార్టీ, పార్టీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.
దీంతో అమెపై బీజేపి అధ్యక్షురాలు కూడా నోరు చేసుకోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని విడదీసి.. నినాదాలు చేసిన మహిళపై కేసు పెట్టారు. అయితే ఆ క్రమంలో సదరు ప్రయాణికురాలి తండ్రి కూడా తన కూతురును బీజేపి శ్రేణులు అసభ్యపదజాలంతో దూషించారని, చంపుతామని బెదింరించారని కేసు పెట్టినా.. అది బుట్టదాఖలైనట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజాగా తమిళసై సౌందర్యరాజన్ హాజరైన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అటో డ్రైవర్ కదీర్ పెరుగుతున్న ఇంధన ధరలపై సూటిగా ప్రశ్నించారు. దీంతో అతని సమాధానం విన్న అమె.. ఓ వెటకారపు నవ్వు నవ్వి.. మళ్లీ మీడియాతో మాట్టాడటం ప్రారంభించారు.
అయితే అమె పక్కనే ఉన్న బీజేపీ నేత కాళిదాస్ కదీర్ రెక్కపట్టుకుని బయటకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. వీడియో వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన తమిళసై నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై ఆవెనువెంటనే స్పందించిన ఆమె అటో డ్రైవర్ తాగివున్నాడని కూడా అరోపించారు. ఇక నిజం ఎంత దాస్తే మాత్రం లాభం ఏంటీ.? ఓ వైపు నెట్ జనులు ఈ ఘటనపై బీజేపిని తూర్పారబడుతూ.. మరో వైపు అటో డ్రైవర్ కు తమ సానుభూతిని ప్రకటించారు. దీంతో తప్పు దిద్దుకుని నష్ట నివారణ చర్యలకు ఆలస్యంగా పూనుకున్నారు తమిళసై సౌందర్యరాజన్.
ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి అమె క్షమాపణలు చెప్పారు. స్వీట్లు పట్టుకుని కదిర్ ఇంటికి వెళ్లి ఆమె.. కదీర్ నుంచి క్షమాపణలు వేడుకున్నారు. ఈ విషయాన్ని అమె తన సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ కదిర్ మాట్లాడుతూ.. తమిళసై మేడమ్ తన ఇంటికి వచ్చారని, కాళిదాస్ తనపై చేయి చేసుకున్న విషయం ఆమెకు తెలియదని చెప్పారని పేర్కొన్నాడు. తనకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు. పెట్రో ధరలను కేంద్రం త్వరలోనే తగ్గిస్తుందని మేడమ్ చెప్పారని కదిర్ పేర్కొన్నాడు.
சென்னையில் பாஜகவினரால் தாக்கப்பட்டதாக கூறப்பட்ட ஆட்டோ ஓட்டுநரின் வீட்டிற்கு சென்று தமிழிசை சவுந்தரராஜன் நலம் விசாரிப்பு #TamilisaiSoundararajan @DrTamilisaiBJP pic.twitter.com/9vF7Z7VKSk
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) September 18, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more